ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి మండలంలో జరిగే తెలంగాణా లోని రెండో అతిపెద్ద జాతర "నాగోబా", ఆదివాసి గిరిజనులలో గోండు జాతికి చెందినా వారు జరుపుకునే ఉత్సవమే నాగోబా జాతర, ఇక్కడ ఉత్సవాలని ప్రభుత్వం అధికారికంగా జరిపిస్తుంది, ఈ జాతరకు జిల్లా కలెక్టర్ వచ్చి ప్రారంభిస్తారు, ప్రజా ప్రతినిధులు, నాయకులు కూడా హాజారవుతారు.
ఈ జాతర వేల సంవత్సరాల చరిత్రను
కలిగి ఉంది, ఇక్కడ ఒక దేవాలయం ఉంది, ఇందులో ఆదిశేషుడు కొలువై ఉంటాడు, ఆయనను
కొలిచే వేడుకే ఈ నాగోబా జాతర, సాంప్రదాయం ప్రకారం గోండు జాతిలోని మోస్రం
వంశీయులు ఈ వేడుకలను నిర్వహిస్తారు, జాతర సందర్భంగా వీరు మర్రి చెట్లకు
కింది భాగంలో బస చేస్తారు, ఆడవారు బస చేసే ప్రాంతాన్ని గోవాడ్ అంటారు.
No comments:
Post a Comment