ప్రతి సంవత్సరం శివరాత్రి మహా పర్వదినం
వచ్చిందంటే చాలు ఊరూర వెలసిన శివక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడిపోతాయి.
వందలు, వేల సంఖ్యలో భక్తులు పొద్దంతా ఉపవాసాలు ఉండి, సాయంకాలం నుండి
రాత్రిళ్లు పొద్దు పోయేదాకా ఈశ్వరుని ఆరాధనలలో మునిగిపోతారు. రాత్రంత
జాగారం చేసే వారు మరెందరో. దేశవ్యాప్తంగా ఆ రోజు శైవ దేవాలయాలన్నీ ప్రత్యేక
అర్చనలు, సేవలు, అభిషేకాలతో కన్నులపండువ చేస్తాయి. ఈ సందర్భంగా భక్తియాత్ర
చేద్దామనుకునే వారి కోసం మన రాష్ట్రంలోని ప్రధాన శివక్షేత్రాల దర్శనార్ధం
శివరాత్రి సందర్భంగా ఎపిఎన్ఆర్టిసితోపాటు ప్రైవేట్ టూరిస్టు సంస్థలు కూడా
ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బస్ సౌకర్యాలను కల్పిస్తాయి.
పండగ సందర్భంగా మహాక్షేత్రాలను దర్శించడం ఒక అపురూపమైన అనుభూతి. ఆరోజు గర్భగుడిలోకి ప్రవేశం లభించడమే గొప్ప. అక్కడ లింగరూపంలోని కైలాసనాధుని దర్శనం ఒక మహద్భాగ్యమే. ఈ సందర్భంగా ఎంతో ఓపిక ఉంటే తప్ప ఈ కార్యం నెరవేరదు. పరమ పవిత్రమైన శివరాత్రి పూట కోరుకున్న క్షేత్రంలో గడపాలనుకునే వారు తత్ సంబంధ శ్రమ, కష్టాలు, ఖర్చులకు ఓర్చుకోవాల్సి ఉంటుంది.
పండగ సందర్భంగా మహాక్షేత్రాలను దర్శించడం ఒక అపురూపమైన అనుభూతి. ఆరోజు గర్భగుడిలోకి ప్రవేశం లభించడమే గొప్ప. అక్కడ లింగరూపంలోని కైలాసనాధుని దర్శనం ఒక మహద్భాగ్యమే. ఈ సందర్భంగా ఎంతో ఓపిక ఉంటే తప్ప ఈ కార్యం నెరవేరదు. పరమ పవిత్రమైన శివరాత్రి పూట కోరుకున్న క్షేత్రంలో గడపాలనుకునే వారు తత్ సంబంధ శ్రమ, కష్టాలు, ఖర్చులకు ఓర్చుకోవాల్సి ఉంటుంది.
శ్రీశైలం

శ్రీకాళహస్తి

అసాధారణ శిల్పకళతో అలరారే మహా శైవక్షేత్రం
శ్రీకాళహస్తి. ఇది తిరుపతి పట్టణానికి కేవలం 36 కి.మీ. దూరంలోనే ఉంది.
ఇక్కడ ఈశ్వరుడు ఒక వాయులింగంగా దర్శనమిస్తాడు. ఏనుగు, పాము, సాలెపురుగు
కలసి ఇక్కడి లింగరూపంలోని ఈశ్వరుని అభిషేకించిన గొప్ప పౌరాణిక కథను భక్తులు
ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటారు. స్వర్ణముఖి నదీ తీరంలో వెలసిన
శ్రీకాళహస్తీశ్వరుని నిత్యం వేలాదిమంది దర్శించుకుంటారు. ఇక శివరాత్రి
పర్వదినం రోజు అయితే యాత్రికుల సంఖ్య అసాధరణంగా ఉంటుంది. ఇది
రేణిగుంట-గూడూరు రోడ్డుమార్గంలో ఉంది.
ద్రాక్షరామం

లేపాక్షి

దక్షిణ భారతదేశంలోనే ఎంతో పేరెన్నికగన్న నంది విగ్రహం ' లేపాక్షి 'లో ఉంది. లేపాక్షి బసవయ్యగా సుప్రసిద్దమైన ఈ నందీశ్వరుడిని శివరాత్రి రోజు దర్శించడం ఒక మరచిపోలేని అనుభూతిగా భక్తులు అభివర్ణిస్తారు. ఇక్కడి వీరభద్రస్వామి దేవాలయంలో ప్రధాన దైవం కంటే కూడా ఈ నందీశ్వరుని ఆలయం విజయనగర రాజుల శైలిలో ఉంది. బెంగుళూరు - హైదరాబాద్ రైల్వే మార్గంలో హిందూపూరుకు15 కి.మీ., బెంగుళూరుకు 100కి.మీ. దూరంలో లేపాక్షి ఉంది.
వేములవాడ

మహానంది

కర్నూలు జిల్లాలో వెలసిన మహానందిశ్వరస్వామి ఆలయం
దేశంలోని నవ నందులలో ఒకటిగా చెబుతారు. ఇక్కడి గుండంలోనికి అయిదు విభిన్న
ప్రాంతాల నుండి స్వచ్చమైన స్పటికజలం పంటపొలాల సాగుకు ఉపయోగపడుతోంది.
గుంటూరు-ధర్మవరం రైల్వేలేనుపై నంద్యాల రైల్వేస్టేషన్కు కేవలం 15 కి.మీ.
దూరంలోనే ఈ క్షేత్రం ఉంది. శ్రీశైలం వెళ్లే యాత్రికులు చాలా మంది విధిగా
మహానందిని సందర్శించటం పరిపాటి.
కీసరగుట్ట

కాణిపాకం

No comments:
Post a Comment