Wednesday 25 June 2014

తెలంగాణ కాలరేఖ



1948 నుండి
1948     సెప్టెంబరు 17: నిజాం కబందహస్తాల నుంచి విముక్తిపొందింది.
1948     ఆగస్టు 22: నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు షోయబుల్లాఖాన్ హత్య జరిగింది.
1950
1953     ఆగస్టు 25 న తెలంగాణ వైతాళికుడిగా పేరుపొందిన సురవరం ప్రతాపరెడ్డి మరణించాడు.
1956     ఫిబ్రవరి 20 న తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నాయకుల మధ్య పెద్దమనుషుల ఒప్పందం కుదిరింది.
1956     నవంబరు 1 న తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో భాగమైంది.
1960
1961     ఫిబ్రవరి 6 న తెలంగాణకు చెందిన ప్రముఖ సమరయోధుడు, రచయిత వట్టికోట ఆళ్వారుస్వామి మరణించాడు.
1969     ఫిబ్రవరి 28 న ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధన ధ్యేయంగా యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితి ని స్థాపించారు.
1969     మార్చి 29 న ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
1970
1970     జూలై 24 న తెలంగాణ పితామహుడిగా పేరుపొందినకొండా వెంకట రంగారెడ్డి మరణించాడు.
1976     మార్చి 31 న ప్రముఖ తెలంగాణ సాయుధపోరాట యోధుడు, కమ్యూనిస్టు నాయకుడు రావి నారాయణరెడ్డి మరణించాడు.
1978     ఆగస్టు 15 న హైదరాబాదు జిల్లా లోని గ్రామీణ ప్రాంతాలను విడదీసి రంగారెడ్డి జిల్లా ఏర్పాటు చేయబడింది.
1990
1990     జూన్ 21 న తెలంగాణ ప్రాంతానికి చెందిన పి.వి.నరసింహారావు ప్రధానమంత్రి పదవి చేపట్టాడు.
2000
2007     ఏప్రిల్ 16 న హైదరాబాదు నగరపాలక సంస్థ స్థానంలో "గ్రేటర్ హైదరాబాదు"(హైదరాబాదు మహానగరపాలక సంస్థ) ఏర్పడింది.
2009     నవంబరు 29 న ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష మొదలైంది.
2009     డిసెంబరు 9 న భారత ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలుపెడుతున్నట్లు ప్రకటించింది. దానితో కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిరాహారదీక్ష విరమించాడు.
2010
2011     మార్చి 10 న ప్రత్యేక తెలంగాణకై ట్యాంక్‌బండ్‌పై మిలియన్ మార్చ్ ఉద్యమం నిర్వహించబడింది.
2013     జూలై 30 న ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేసింది.
2013     అక్టోబరు 3 న ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
2013     డిసెంబరు 5 న తెలంగాణ ఏర్పాటు ముసాయిదా బిల్లును కేంద్రకేబినెట్ ఆమోదించింది.
2014     జనవరి 7 న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
2014     ఫిబ్రవరి 13 న తెలంగాణ ఏర్పాటు (ఆంధ్రప్రదేశ్ విభజన) బిల్లు లోకసభలో ప్రవేశపెట్టబడినది.
2014     ఫిబ్రవరి 18 న లోకసభలో తెలంగాణ ఏర్పాటు బిల్లుకు ఆమోదం లభించింది.
2014     ఫిబ్రవరి 20 న రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందింది.
2014     మార్చి 1 న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదముద్ర లభించింది.
2014     మార్చి 4 న ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ జూన్ 2, 2014 నుంచి అధికారికంగా అమలులోకి వస్తుందని కేంద్ర హోంశాఖ ప్రకటించింది.
2014     జూన్ 2 న భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది.
2014     జూన్ 2 న తెలంగాణ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రమాణ స్వీకారం.

No comments:

Post a Comment