Monday 23 June 2014



1. భర్త సహా పది మంది కీచకుల ఘాతుకం


ఖాండ్వా(మధ్యప్రదేశ్): దేశం సిగ్గుతో తలదించుకునే ఉదంతమిది. మధ్యప్రదేశ్లో ఓ గిరిజన మహిళపై ఆమె భర్త, బంధువులు సహా పది మంది సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అంతకుముందు ఆమెను కొట్టి, నగ్నంగా ఊరేగించారు. ఆమె తాగడానికి నీళ్లు అడగ్గా ఆమె మైనర్ కొడుకు ఎదుటే బలవంతంగా మూత్రం తాగించారు. భియాలీ ఖేలా గ్రామంలో నాలుగు రోజుల కింద భూవివాదం కారణంగా ఈ దారుణం జరిగింది.

తన భర్త కైలాస్ రుమాలియా ప్రోద్బలంతో దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితులను శనివారం అరెస్టు చేశారు. కాగా, యూపీలోని బదాయూ జిల్లా బిసౌలీ ప్రాంతంలో తన ఇద్దరు పిల్లలతో కలిసి మందుల కోసం వెళ్లిన ఓ మహిళ(32)పై ఓ పోలీసు కుమారుడు సహా ముగ్గురు దుండగులు శుక్రవారం రాత్రి గ్యాంగ్రేప్ చేశారు.


2.వివాహితపై సామూహిక అత్యాచారం, హత్య


కృష్ణాజిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. వివాహితపై సామూహిక అత్యాచారం చేసి అనంతరం ఆమెను హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చారు. ఈనెల 12న స్వర్ణలత అనే మహిళను మచిలీపట్నం శివారలో దుండగులు బలవంతంగా ఆటోలో తీసుకు వెళ్లి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఈ కేసుకు సంబంధించి ప్రధాన నిందితుడు శ్రీనివాస్‐, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.

స్వర్ణలతకు ప్రధాన నిందితుడు శ్రీనివాస్‐తో ఇంతకుముందే పరిచయం ఉందని, పెళ్లికి ముందే వీళ్లు ఆమెకు తెలుసని పోలీసులు చెప్పారు. అప్పుడప్పుడు అతడికి ఆమె డబ్బులు సర్దుబాటు చేసేవారని, మూడేళ్ల క్రితం ఆమెకు విశాఖపట్నానికి చెందిన యువకుడితో పెళ్లయ్యి, ఒక కొడుకు కూడా ఉన్నాడని తెలిపారు. సెలవల్లో గడిపేందుకు కొడుకుతో సహా వచ్చిన స్వర్ణలతను శ్రీనివాస్ మరోసారి డబ్బులు అడిగాడు. కొడుకుతో సహా ఆమెను ఆటోలో మచిలీపట్నం శివారు ప్రాంతాలకు తీసుకెళ్లాడు. అక్కడ ఆమె నగలు తీసుకున్న తర్వాత.. శ్రీనివాస్‐, అతడితో పాటు
ఉన్న మరో ఇద్దరు ఆమెపై అత్యాచారం చేశారు.

విషయం బయటకు తెలిస్తే సమస్య అవుతుందని భావించి చంపేశారు. తర్వాత ఆమె కొడుకును తీసుకెళ్లి మచిలీపట్నంలో వదిలేశారు. స్వర్ణలత ఎంతకీ కనపడకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదుచేసి గాలించగా, విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.


3.ఏడేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం


ముజఫర్‐నగర్ : ఉత్తరప్రదేశ్‐లోని ముజఫర్‐నగర్ జిల్లాలో ఘోరం జరిగింది. ఏడేళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. పొలాల్లో ఆడుకుంటున్న చిన్నారిని ఒక వ్యక్తి వచ్చి ఎత్తుకెళ్లాడని, అతడితో పాటు మరో ఇద్దరు కలిసి ఆమెపై అత్యాచారం చేశారని బాలిక తల్లిదండ్రులు చెప్పారు. ఉదయం 8­9 గంటల సమయంలో ఈ సంఘటన జరిగిందని, బాలిక పరిస్థితి విషమంగా ఉందని ఆమె మేనమామ చెప్పారు.

బాలిక పొలాల్లో ఒంటరిగా పడి ఉండగా స్థానికులు గమనించి ఆమె కుటుంబ సభ్యులకు తెలిపారు. సంఘటన జరిగిన తర్వాత పోలీసులకు విషయం చెప్పినా.. వారు వెంటనే స్పందించాల్సింది పోయి, పది గంటల తర్వాత మాత్రమే ఆమెను ఆస్పత్రిలో చేర్చారని ఆరోపించారు. ప్రస్తుతం ఆమె జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతోంది. నిందితులలో ఒకరిని పోలీసులు అరెస్టు
చేశారు.

4.అడవుల్లోకి లాక్కెళ్లి మహిళపై గ్యాంగ్ రేప్


దెవాస్: వివాహితను అడవుల్లోకి లాక్కుపోయి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ లోని బారిజాషిలో చోటుచేసుకుంది. బాగ్లీ­పంజాపూర్ రహదారిలో ఈ దారుణం జరిగిందని పోలీసులు తెలిపారు. గుర్తు తెలియని దుండగులు 25 ఏళ్ల వివాహితను అపహరించి ఈ ఘాతుకానికి ఒడిగట్టారని వెల్లడించారు.

తనపై జరిగిన దారుణాన్ని వెల్లడించేందుకు బాధితురాలు అడవి నుంచి రోడ్డుపైకి వచ్చేందుకు ప్రయత్నించగా ఆమె తేనెటీగలు దాడి చేయడం విషాదమని పోలీసులు తెలిపారు. బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. మిగతావారి కోసం
గాలిస్తున్నారు.

5.రాజమండ్రిలో యువతిపై సామూహిక అత్యాచారం


రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరంలోని లాలాచెరువు సమీపంలో గురువారం దారుణం జరిగింది. పని కోసం రాజమండ్రి వచ్చిన ఓ యువతిని పలువురు యువకులు మాయమాటలు చెప్పి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ యువకులు అక్కడి నుంచి పరారైయ్యారు. దాంతో ఆ యువతి జరిగిన విషయాన్ని స్థానికులకు వెల్లడించింది.

స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆ యువతిని పోలీసులు స్టేషన్‐కు తరలించారు. నిందితుల వివరాలు సేకరించి వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం ఆ యువతిని వైద్య పరీక్షల నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.


6.జాలీ రైడ్కని పిలుచుకు వెళ్లి ...


బెంగళూరు : పీయూసీ విద్యార్థినిపై ఇద్దరు సామూహిక అత్యాచారం చేసిన సంఘటన బెంగళూరులో వెలుగుచూసింది. బ్యాటరాయణపుర పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నగరంలో ప్రముఖ ప్రైవేటు కాలే జీలో పీయూసీ చదువుతున్న ఓ యువతికి (18) అభిషేక్ అనే వ్యక్తి 10 నెలల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమయ్యాడు. రెండుసార్లు వ్యక్తిగతంగా కూడా కలుసుకున్నారు.

ఆదివారం సాయంత్రం జాలీ రైడ్ పేరుతో అభిషేక్, అతని స్నేహితుడు రాజు బలవంతంగా ఆ యువతిని కారులో తీసుకెళ్లారు. నగర శివార్లలోని తలఘట్టపుర సమీపంలోని నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి వారిద్దరూ అత్యాచారం చేశారు. విషయం బయటకు చెబితే చంపేస్తామని బెదిరించి.. బ్యాటరాయణపుర సమీపంలోని నిర్జన ప్రదేశంలో సోమవారం ఉదయం ఆ యువతిని వదలిపెట్టి పరారయ్యారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బ్యాటరాయణపుర పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.


7.సాఫ్ట్వేర్ ఇంజనీర్‐పై అత్యాచార యత్నం


బెంగళూరు : జార్ఖండ్కు చెందిన యువతిపై దుండగులు అత్యాచారానికి యత్నించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎలక్ట్రానిక్సిటీ పోలీసుల కథనం మేరకు..దొడ్డతోగూరులో పీజీ సెంటర్ నిర్వహిస్తున్నారు. జార్ఖండ్కు చెందిన యువతి (25) ఈ హాస్టల్లో ఉంటూ నగరంలోని ప్రైవేటుసాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీరుగా ఉద్యోగం చేస్తోంది.

శుక్రవారం రోజు దుండగులు హాస్టల్లో చోరీచేసేందుకు వెళ్లగా గదిలో ఒంటరిగా ఉన్న ఆ
యువతిపై అత్యాచారానికి యత్నించి గాయపరిచారు. హాస్టల్ నిర్వాహకులు గుర్తించి
బాధితురాలిని సెయింట్ జాన్స్ ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారని తెలిసింది.


8.అత్యాచారం.. అవమానభారంతో ఆత్మాహుతి!!


జైపూర్ : రాజస్థాన్‐లో ఘోరం జరిగింది. అత్యాచారానికి గురయ్యానన్న అవమానంతో ఓ యువతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. చావుబతుకుల మధ్య ొట్టుమిట్టాడుతూ ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలు ఉండే భవనంలోనే అద్దెకు ఉంటున్న మనీష్ (25) అనే యువకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ యువతి తల్లిదండ్రులు పనిమీద బయటకు వెళ్లగా, ఆమె ఒంటరిగా ఇంట్లో ఉన్న సమయంలో మంగళవారం నాడు ఈ దారుణం
జరిగింది.

మనీష్ ఆమెపై అత్యాచారం చేస్తుండగా, అతడి స్నేహితుడు రాజేంద్ర శర్మ కిటికీలోంచి
చూసినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అవమాన భారాన్ని భరించలేక ఆమె తన ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె పెట్టిన కేకలు విని ఇరుగుపొరుగులు వచ్చి రక్షించి ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. ఆస్పత్రిలోనే ఆమె వాంగ్మూలం తీసుకున్నట్లు ఏసీపీ ప్రేమ్ దన్ రత్ను తెలిపారు. ఈ కేసులో నిందితులైన మనీష్, రాజేంద్ర ఇద్దరినీ అరెస్టు చేశామన్నారు.


9.బాలికపై ఐదుగురి అత్యాచారం


గుత్తి : అనంతపురం జిల్లా గుత్తిలో దారుణం జరిగింది. ఓ బాలికపై ఐదుగురు యువకులు పలుమార్లు అత్యాచారం చేసి, ఆమెను గర్భవతిని చేశారు. గుత్తి పట్టణంలోని ఓ కాలనీలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఏడాది క్రితం ఆ ఇంట్లో పెద్ద కుమార్తె వివాహం జరిగింది. ఆ సమయంలో ఫొటోలు తీసేందుకు వచ్చిన మరో కాలనీకి చెందిన మోసెస్ అనే యువకుడితో చిన్న కుమార్తె (15)కు పరిచయం
ఏర్పడింది. అలా ఆ యువకుడు అప్పుడప్పుడు ఆ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు.

ఈ క్రమంలో మాయమాటలతో, భయపెట్టి ఆ అమ్మాయిని లోబరుచుకున్నాడు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. ఈ క్రమంలో మోసెస్ స్నేహితులు నలుగురు కూడా ఆ అమ్మాయిని బెదిరించి అత్యాచారం చేస్తూ వచ్చారు. ఇటీవల ఆ అమ్మాయి పొట్ట ఎత్తుగా పెరగడాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్తే, ఏడు నెలల గర్భవతి అని వైద్యులు తేల్చారు. దీంతో బాధితురాలు తండ్రితో కలిసి సోమవారం పోలీసులను
ఆశ్రయించింది.

ఐదుగురు యువకులు తనను బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారం చేశారని చెప్పిన
బాధితురాలు.. ఫిర్యాదులో మోసెస్ పేరును మాత్రమే పేర్కొంది. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

No comments:

Post a Comment