Friday 13 June 2014

రమణీయ దృశ్యకావ్యం... రామగిరి ఖిల్లా..!



క్రీశ 1వ శతాబ్దంలో రామగిరి కోటను నిర్మిం చారు. ఈ ప్రాంతాన్ని గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి పాలించినట్లు పెద్దబొంకూర్‌, గుంజపడుగు గ్రామాల్లో పురావస్తు శాఖ తవ్వకాల్లో బయటపడిన ఆధా రాలు తెలుపుతున్నాయి. చంద్రగుప్తుడు, బిందుసారుడు, అశోకుడు ఈ దుర్గాన్ని అభివృద్దిపరిచారని చరిత్ర చెబు తుంది. క్రీశ 1158 లో చాళుక్య గుండ రాజును ఓడిం చి కాకతీయులు రామగిరి దుర్గాన్ని స్వాధీనపరు చుకొ న్నారు. రామగిరి ఖిల్లాను ప్రతాపరుద్రుడు 1195 వరకు పాలించినట్లు ఓరుగల్లు మంత్రకూటముల శాశనాలు తెలి యపరుస్తున్నాయి. అనంతరం 1442 లో బహమనీ సుల్తా నులు ఆక్రమించుకోగా వారి నుంచి రెడ్డి రాజులు స్వాధీనం చేసుకొన్నట్లు చరిత్రక ఆధారాలున్నాయి. అటుపిమ్మట 1595లో మొఘలా యిల స్వాధీనంలోకి వెల్లింది. 1606 లో గోల్కొండ నవాబుల ఈ దుర్గాన్ని తమ స్వాధీనంలోకి తీసు కున్నారు.

వారి నుండి మహమ్మదీయులు వశపరుచు కొని నైజాం కాలం వరకు పాలించినట్లు చరిత్ర చెబుతుం ది. అప్పట్లో రామగిరి కోటకు ఇరువైపులా తొమ్మిది ఫిరం గులు 40 తోపులు ఉండేవి. కాలక్రమంలో వాటి సంఖ్య కుదించుకుపోయింది. ప్రస్తుతం కేవలం ఒక్క ఫిరంగి మాత్రమే ఉంది. పౌరాణికంగాకూడా రామగిరి ప్రత్యేకస్థా నాన్ని సంపాదించుకుంది. శ్రీరాముడు వనవాసం సమయంలో ఇక్కడికి వచ్చి తపస్సు చేసి ఇక్కడ శివలింగం ప్రతిష్టించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ కోటపైన సీతాసమేత శ్రీరాముడు, హను మాన్‌ విగ్రహాలతో పాటు నంది విగ్రహం కూడా ఉంది. శ్రీరాముని విగ్రహం ఉన్న చోట సుమారు 1000 మంది తలదాచుకునేంత విశాల ప్రదేశం ఉండడం విశేషం. రాజులపాలనలో రామగిరిఖిల్లా పరిసర ప్రాంతానికి రామగిరి పట్టణం అనే పేరు వచ్చింది. చుట్టుపక్కల గ్రామాలన్నీ వాడలుగా ఉండేవని అంటారు. రాజుల ఆస్థానంలో సంగీత నృత్యకళాకారులుండే ప్రాంతాన్ని బోగంవాడ అనేవారట. కాలక్రమేణ అది బోగంపేట మారింది.

శ్రావణం మాసం లో సందడే సందడి...

 
వర్షాకాలంలో పచ్చదనం పరుచుకోవడం తో... ప్రతి శ్రావ ణమాసంలో రామగిరిఖిల్లాపై పర్యాటకుల సందడితో ఆహ్ల దకర వాతావరణం ఉంటుంది. రామగిరి దుర్గంపై ప్రకృతి అందచందాలను తిలకిస్తూ పర్యాటకులు మైమరిచిపోతా రు. ఆయుర్వేద వైద్యులు ఈ ఖిల్లాపై విలువైన వనమూ లికలను సేకరిస్తారు. తెలంగాణ ప్రాంతంలో ప్రాచీన కళా సంపదకు నిలయమైన రామగిరిఖిల్లా ఇంకా ఎంతో అభి వృద్ధి చెందాల్సివుంది. పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దుతా మని పాలకులు చెబుతున్న నేటికి ఆచరణకు అమలు కాలేదు.

శిల్ప కళకు ఒడి..! 

కాకతీయుల కాలంలో రామగిరిపై నిర్మించిన రామగిరి కోట శిల్ప కళా సంపదతో శోభిల్లుతుంది. పర్యాట కులను ఆహ్లదపరు స్తూ అలరిస్తోంది. కాకతీయుల శిల్ప సాంస్కృతిక సంప దకు తార్కాణంగా నిలుస్తూ. .. శ్రావణ మాసంలో వచ్చే భక్తులకు, సందర్శకులకు నిలయంగా మారింది. ఇక్కడి నిర్మింపజేసిన రాతి కట్టడాలు అప్పటి శిల్ప కళానైపుణ్యాన్ని చాటుతాయి. రాతిపై చెక్కిన సుందర దశ్యాలు పర్యాటకులను మంత్ర ముగ్దులను చేస్తుంది.

రాముడు నడయాడిన నేల... 

వనవాసం కాలంలో శ్రీరాముడు రామగిరిపై కొద్దిరోజులు కుటీరం ఏర్పారుచుకొని సీతా లక్ష్మణులతో ఉన్నారని పెద్ద లు చెబుతారు. ఈ ఖిల్లాపై సీతారామలక్ష్మణులు సంచరిం చినట్లు చెప్పబడుతున్న కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ చెక్కుచెద రకుండా పర్యాటకులకు దర్శనమిస్తాయి. ఖిల్లాపైన గల బండరాతిపై శ్రీరాముని పాదాలు, సీతాదేవి స్నానమాచరిం చిన కొలనుతో పాటు శ్రీరామునితో సంచరించిన ఆంజనేయుడి విగ్రహం కూడా నెలకొల్పబడివుంది.


నాటి వాడలే నేటి పల్లెలు...


రాజుల పరిపాలనాకాలంలో వాడలుగా పిలువబడిన రామ గిరి దుర్గం చుట్టుపక్కల ప్రాంతాలు నేడు పల్లె సీమలుగా మారాయి. వాడల యొక్క విశిష్టతను బట్టి నేటికీ ఆ గ్రామా ల పేర్లు అలాగే కొనసాగుతుండడం విశేసం. రత్నాలు విక్రయించే వీధిని రత్నాపూర్‌గా మహ్మదీ యుల కాలంలో బేగంలు నివాసం ఉండేప్రాంతం నేడు బేగంపేటగా పిలవబడుతోంది. అదేవిధంగా పోతన పేరుతో ఉన్న వాడను పోతారంగా, ఆయన తల్లి లక్కమాంబ పేరుతో ఉన్న ప్రాంతాన్ని లక్కారం అని, నాగాళ్లు నిలిపేచోటును నాగెపల్లి అని, శుక్రవారం సంత జరిగేచోటును శుక్రవారం పేట అని ఆదివారం సంత జరిగేచోటు ఆదివారంపేట గా మైదపుపిండి విసురురాళ్ళు ఉండే చోటును మైదంబండ గా, గుండరాజు పేరున గుండారం అనే పేర్లు వాడుకలోకి వచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.

చూడాల్సిన ప్రదేశాలు...

రామగిరి దుర్గం అంతర్బాగంలో సాలుకోట, సింహల కోట, జంగేకోట, ప్రతాపరుద్రుల కోట, అశ్వశాల కోట, కొలువుశాల, మొఘల్‌శాల, చెరశాల, గజశాల, భజన శాల, సభాస్థలి వంటి వాటితో పాటు చెక్కరబావి, సీతమ్మ బావి, పసరుబావి, సీతమ్మకొలను, రహస్య మార్గాలు, సొరంగాలు లాంటి అనేక ప్రదేశాలు పర్యా టకులను ఇట్టే మైమరిచిపోయేలా చేస్తాయి.

రామగిరి చరిత్ర వెలుగులోకి వచ్చిన విధం...
రామగిరి చరిత్రను వెలుగులోకి తీసుకరావడానికి పలు వురు రచయితలు ఎంతో వ్యయ ప్రయాసలుకోర్చి రామ గిరి చరిత్రను పుస్తకరూపంలో ప్రచురించారు. కాల్వ శ్రీరాంపూర్‌ మండలం మంగపేటకు చెందిన యరబాటి బాబురావు, కమాన్‌పూర్‌ మండలానికి చెందిన మాధవ రావు, బలరాందాస్‌లు ‘రామగిరి మహత్యం’ పేరుతో ఓ గ్రంథాన్ని రాశారు. వీరికంటే ముందు రామగిరి చరి త్రను వెలికితీసిన ఘనత ఆర్‌.బాలప్రసాద్‌కే దక్కుతుం దంటారు.

‘కళ’ తప్పుతోందా..?


గత చరిత్ర వైభవానికి సజీవ సాక్ష్యమైన రామగిరి ఖిల్లా... ప్రభుత్వం, పురావస్తు శాఖల నిర్లక్ష్యం మూలం గా కళావిహీనమవుతోంది. ప్రాచీన సంస్కృతికి, కళావైభ వానికి అద్దంపట్టిన ఇక్కడి కట్టడాలు కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదంవుంది. ఇప్పటికైనా ఈ కళాసంపద కనుమరుగు కాకుండా ఈ చారిత్రాత్మక కళాసంపద ను పరిరక్షించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉంది. ఇదిలా ఉండగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అప్పటి కేం ద్రహోం శాఖ సహాయ మంత్రి విద్యాసాగర్‌రావు పాద యాత్ర చేపట్టి... రామగిరిఖిల్లాను పర్యా టక కేంద్రంగా తీర్చిదిద్దుతామని హమీ ఇచ్చారు. అయినా ఆ హామీ హామీగానే మిగిలిపోయింది. ఇప్పటి కైనా రాష్ట్ర ప్రభుత్వం రామగిరిఖిల్లాను పర్యాటక కేంద్రాంగా తీర్చిదిద్ది అరుదైన కళాసంపదను కాపాడాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారు.





 

No comments:

Post a Comment