Tuesday 22 July 2014

బ్రిటీష్‌ సైనిక బలగాలను సవాల్‌ చేసిన యోధురాలు బేగం హజరత్‌ మహాల్‌..




మాతృభూమి కోసం ప్రాణాలను పణంగా పెట్టి, బ్రిటీష్‌ సైనిక బల గాలతో తలపడిన రాణులు స్వాతంత్రోద్యమ చరిత్రలో అరు దుగా కన్పిస్తారు. ఆ అరుదైన ఆడపడుచులలో అగ్రగణ్యురాలు బేగం హజరత్‌ మహాల్‌. ప్రథన స్వాతంత్య్రసంగ్రామం తొలిద శలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ పాలకు లతో రాజీబేరాలు కుదు ర్చుకునే ప్రయత్నాలు చేసి, అవి విఫలమై చివరకు మార్గాంతరం లేక పోరు మార్గం ఎంచుకున్న రాణుల్లా కాకుండా, ఆది నుండి కంపెనీ పాలకులను శత్రువులుగా పరిగణిం చి, మాతృదేశ పరిర క్షణార్థం, ప్రజల ఆత్మగౌరవం కోసం ఆయుధం పట్టక తప్పదని ప్రకటించి, అత్యంత ధైర్య సాహసాలతో రణభూమి కి నడిచిన వీరనారీమణి బేగం హజరత్‌ మహాల్‌.

ఆమె ఉత్తర భారతదేశంలోని అత్యంత సంపన్నవంతమైన అవధ్‌ రాజ్యం అధినేత నవాబ్‌ వాజిద్‌ అలీషా సతీమణి. ఆమె స్వస్థలం మాత్రం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫైజాబాద్‌. ఆమె స్వస్థలం మాత్రం ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని ఫైజాబాద్‌. ఆమె చిన్నప్పటి పేరు ముహ మ్మద్‌ ఖానం. ఆమె అందచందాలకు గురించి విన్న నవాబు వాజిద్‌ అలీ షా అమెను కోరి మరీ విహహమాడాడు. వివాహం తరువాత ఆమె బేగం హజరత్‌ మహాల్‌ అయ్యారు. వివాహం తరువాత ఆమెకు ఇఫ్తికారున్నీసా (నారీమణి) అని పేరుపెట్టాడు భర్త. ఆమెను సుగంధ కన్య అని బిరుదు కూడా ఇచ్చాడాయన.


ఆమెను ఇఫ్తికారున్నీసా ఖానం సాహెబా కూడా పిలుచుకున్నాడు. ఆ దంపతులకు విూర్జా బిర్జిస్‌ ఖదిర్‌ బహుద్దూర్‌ అను కుమారుడు కలిగాడు. ఆ తరువాత ఆమె బేగం హజరత్‌ మహాల్‌ అయ్యారు.
అవధ్‌ రాజ్యం రాజధాని లక్నో. అది మొగల్‌ రాజ్యంలో ఒక భాగం కాగా, ఆ ప్రభువుల బలాధిక్యత క్షీణిస్తున్న సమయంలో స్వతంత్య్రరా జ్యంగా ప్రకటితమైంది. 1801లో అవధ్‌ రాజు నవాబు సాదత్‌ అలీ బ్రిటీష్‌ పాలకులతో సంధి చేసుకుని, అవధ్‌ రాజ్యాన్ని ఈస్ట్‌ ఇండియా కంపెనీకి అప్పగించాడు. అవధ్‌ మిద అధికారం కంపెనీ పాలకులది కాగా, నవాబు నామమాత్రమయ్యాడు.ఆ అవధ్‌ రాజ్యా నికి చివరి నవాబు అయినటువంటి వాజిద్‌ అలీషా 1847లో సింహాసనం అధిష్టించాడు.


ఆ సంవత్సరం గవర్నర్‌ జనరల్‌గా డల్హౌసీ భారతదేశం విచ్చేశాడు. రాజ్యవిస్తరణ కాంక్షతో ఇండియాలోని ఒక్కొక్క రాజ్యాన్ని అక్రమం గా ఆక్రమించుకుంటున్న అతని చూపు సంపన్నవంతమైన అవధ్‌ రాజ్యం మీద పడింది. ఫలితంగా ఈస్ట్‌ ఇండియా కంపెనీకి చెందిన గవర్నర్‌ జనరల్‌ లక్నోలోని ఒక బ్రిటీష్‌ అధికారి ద్వారా లొంగుబా టు పత్రాన్ని తమారు చేయించి నవాబ్‌ వాజిద్‌ అలీషాకు పంపి, ఆ పత్రం మీద సంతకం చేయమని ఆదేశించాడు. ఆ సంత కం చేయ నట్లయితే కంపెనీ సేనలు అవధ్‌ రాజ్యంతో పాటుగా అం తపురాన్ని కూడా స్వాధీనం చేసుకోగలవన్నాడు. ఆ బెదిరింపు లకు భయపడిన నవాబు అవధ్‌ను కంపెనీపరం చేయడా నికి సిద్ధప డ్డాడు.


భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో అవధ్‌ పతాకాన్ని విను వీధుల్లో ఎగరవేసిన బేగం హజరత్‌ మహాల్‌ ఆ సమయంలో రంగ ప్రవేశం చేశారు. ఆ లొంగుబాటు పత్రం మీద సంతకాలు చేయడ మంటే అవధ్‌ రాజ్యాన్ని పూర్తిగా ఈస్ట్‌ ఇండియా కంపెనీకి దాసో హం చేయటమేనని భావించిన ఆమె గవర్నర్‌ జనరల్‌ ఆదేశాలను నిరసించారు. ఈ పరిణామాలతో ఆగ్రహించిన కంపెనీ పాలకులు సవాబ్‌ అలీషాను 1856 ఫిబ్రవరి 13న నిర్బంధంలోకి తీసుకుని, మార్చి 13న కలకత్తా పంపారు. ఆ పరిణామాలకు భయపడిన నవాబు పరివారంలోని అత్యధికులు నవాబుతో పాటుగా కలకత్తా వెళ్ళి పోయారు. బేగం హజరత్‌ మహాల్‌ మరికొందరు మాత్రం, స్వంత గడ్డను పరులపరం చేసి కలకత్తా వెళ్ళటం ఇష్టం లేక లక్నోలోని కౌసర్‌ బాగ్‌లో ఉండిపోయారు.


ఆంగ్లేయుల ఈ చర్య వలన ప్రజలలో అసంతృప్తి రగులుకుంది. అవధ్‌ చుట్టు ప్రక్కల గల స్వదేశీ పాలకులు, స్వదేశీ యోధులు కంపెనీ పాలకుల దుశ్ఛర్యల పట్ల తీవ్రంగా ప్రభావతులయ్యారు. కుతకుతలాడుతున్న హృదయాలతో ఆంగ్లేయుల చర్యల పట్ల మండి పడసాగారు. ఆ సమయంలో ప్రథమ స్వాతంత్య్రసంగ్రామం ఆరంభ మైంది. కంపెనీ చర్యల పట్ల తీవ్రంగా ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తున్న అవధ్‌లోని ప్రజలు, సైనికులు స్వదేశీయుల పాలన కోసం కంపెనీ పాలకుల ఆధిపత్యాన్ని నిరాకరిస్తూ తిరుగుబాటు ప్రకటిం చారు. 1857 మే 31న లక్నోలోని ఛావనీలో తిరుగుబాటు ఫిరంగు లు పేలాయి. ఆంగ్లేయాధికారులను, ఈస్ట్‌ ప్రాంతాల నుండి తరిమి వేశారు. అవధ్‌ రాజ్యంలోని అత్యధిక ప్రాంతాలు తిరుగుబాటు వీరుల అధిపత్యంలోకి వచ్చాయి. కంపెనీ పాలనాధికారం అనవాళ్ళు కూడా కన్పించకుండా తుడుచుకు పోయింది.


ఆ పరిస్థితులతో హడాలిపోయిన ఆంగ్లేయులు బేగంతో కాళ్ళ బేరానికి వచ్చారు ఆమె కనుక కంపెనీకి సైనిక సహాయం అందజేస్తే వాజిద్‌ అలీషా పూర్వీకుడు షుజా ఉద్దౌలా కాలంలో అవథ్‌ పాలన క్రింద ఉన్న అన్ని ప్రాంతాలను తిరిగి ఆమెకు అప్పగిస్తామని , తద్వారా అవధ్‌ రాజ్యం విస్తరించగలదని రాయబారినికి దిగారు. ఈ ప్రతిపాదనను అంగీకరిస్తే కంపెనీ రాజ్యవిస్తరణ కాంక్షకు తాను తొడ్పాటు అందించినట్టు కాగలదు కనుక, స్వేచ్ఛా-స్వాతంత్య్రకాంక్ష గల స్వదేశీ పాలకులకు వ్యతిరేకంగా ఆంగ్లేయుల పక్షాన నలివటం ఏమాత్రం సహించని బేగం హజరత్‌ మహాల్‌ ఆ ప్రతిపాదనను నిర్వందంగా తిరస్కరించారు.
నవాబు వాజిద్‌ అలీషా వంశస్థుల కోసం అన్వేషణ ప్రారంబ óమైంది. బ్రిటీష్‌ పాలకులంటే ఏర్పడిన భయం వలన అక్నోలో ఉంటున్న నవాబు భార్యను కొందరు తమ బిడ్డలకు, కలకత్తాలో ఉన్న భర్త బంధువులకు ఎటువంటి ప్రమాదం సంభవించగలదోనని భయపడి కంపెనీ పాలకుల ఆగ్రహానికి తమను బలి చేయవద్దంటూ ప్రాధేయ పడుతూ నాయకత్వం స్వీకరణకు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆ క్లిష్ట సమయంలో హజరత్‌ మహాల్‌ కంటకప్రాయమైన మార్గంలో కూడా చారిత్రక పాత్ర నిర్వహించేందుకు ఎంతో సాహసంతో ముందుకొచ్చారు. ప్రజల అభియిష్టం మేరకు బిడ్డడు బిర్జిన్‌ ఖదీర్‌ను నవాబుగా ప్రకటించేందుకు అంగీకరించారు. ఆ సందర్భంలో బేగం నిర్వహించిన పాత్ర, ఆమె త్యాగనిరతీ, ఆత్మబలి దానం చిట్టచివరి వరకు శత్రువుకు లొంగని దీరత్వం చరిత్రలో ఆమెకు ప్రత్యేకస్థానం సంతరించి పెట్టాయి.
ఆ సమయంలో అవధ్‌ రాజ్యంలోని ఫైజాబాద్‌లో కంపెనీ పాలకుల బందీగానున్న తిరుగుబాటు యోధుల నేత మౌల్వీ అహమ్మదుల్లా షాను, తిరుగుబాటు యెధులు విడుదల చేయించి ఆయనను తమ నాయకునిగా స్వీకరించారు. మౌల్వీ తన బలగాలతో అక్నో చేరుకు ని కంపెనీ పాలకులను ఎదుర్కోన్నారు ఆ సందర్భంగా బేగం హజరత్‌ మహాల్‌ బ్రిటీషు పాలకులకు వ్యతిరేకంగా మరింత చొరవ తీసుకున్నారు. ఆ కారణంగా తిరుగుబాటు మరింత ప్రజ్వరిల్లింది. పది రోజుల్లో లక్నో అంతా పూర్తిగా తిరుగుబాటు సేనల పరమైంది.


బేగం హజరత్‌ మహాల్‌ తన బిడ్డ బిర్జిస్‌ ఖదీర్‌ను 1857 జూలై 5న అవథ్‌ నవాబుగా ప్రకటించారు. ఆ నిర్ణయాన్ని పలువురు ప్రముఖులు బలపర్చారు. తిరుగుబాటు యోధులలో ఆనందం విల్లి విరిసింది. బిర్జిస్‌ ఖదీర్‌ పేరిట బేగం హజరత్‌ మహాల్‌ పాలన ప్రారంభమైంది. ఆమె అధికారపగ్గాలను చేపట్టగానే పాలనా పరమె ౖన చర్యలను చేపట్టారు.అన్ని సాంఘిక జనకసముదాయాలకు పాలనాధికారంలో భాగం కలిగించే విధంగా సైనికాధికారులకు, తిరుగుబాటు వీరులకు, స్వదేశీ భక్తులకు ప్రతిభా సామర్థ్యాల ఆధారంగా పలు విభాగాల బాధ్యతలను అప్పగించారు.


మతం, కులం, ప్రాంతాల ప్రసక్తి లేకుండా, పౌర-సౌనికాధికార ప్రముఖులైన ముమ్మూఖాన్‌, మహారాజ బాలకృష్ట, బాబూ పూర్ణచంద్‌, మున్షీ గులాం హజరత్‌, మహమ్మద్‌ ఇబ్రహీం ఖాన్‌, రాజా లాలా సింహ్‌, రాణా జిజియా లాల్‌, రాజా మాన్‌సింగ్‌, రాజా దేశిబక్ష్‌ సింగ్‌, రాజా బేణిప్రసాద్‌ లాంటి వారితో ఉన్నాతస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.ఈ కమిటి ప్రతి రోజు సమావేశమ య్యేది. ప్రతి అంశాన్ని సభ్యుల ఎదుట పెట్టి, చర్చించి ప్రజాస్వామ్య బద్దంగా నిర్ణయాలు తీసుకొని వాటి అమలును బేగం పర్యవేక్షిం చారు. ఆనాటి రాజరికపు రోజుల్లో ఆ విధంగా ప్రజాస్వామికంగా వ్యవహరించటం బేగం హజరత్‌ మహాల్‌ బుద్దికుశలతకు నిదర్శ నం. అన్ని రంగాలు పూర్తిగా ఆమె ఆధీనంలోకి వచ్చాక అవధ్‌ నవాబు బిర్జిస్‌ ఖధిర్‌ పేరిట వెలువడిన ప్రకటనలు అవథ్‌ రాజ్యంలో ఆంగ్లేయుల పాలన అంతటితో అంతమైందని ఆ ప్రకటనలు స్పష్టం చేశాయి. అంతటితో ఆమె మిన్నకుండి పోలేదు. స్వయంగా గుర్రం మీద, ఏనుగు మీద సవారి చేస్తూ ప్రజలను, ప్రముఖులను కలుస్తు ఆమె రాజ్యమంతా తిరిగి అందర్ని ఏకతాటి మీదకు తెచ్చేందుకు విజయవంతంగా ప్రయత్నించారు.


బేగం హజరత్‌ మహాల్‌ ఎటువంటి ప్రగతిశీల, సామరస్యపూర్వక విధానాలు చేపట్టినా, ఆమె శక్తిసామర్థ్యాల పట్ల విశ్వాసం కలుగని కొందరు స్వదేశీ పాలకులు, జమీందారులు ఆమె నాయకత్వాని& తొలుత ఆమోదించలేదు. అవధ్‌ అంతటా అస్తవ్యస్థ పరిస్థితి, క్రమ శిక్షణారాహిత్యం, వ్యక్తిగత స్వార్థంతో కంపెనీ పాలకులవవైపు మొగ్గు చూపుతున్న విద్రోహుల బెడద, బేగం శక్తి సామర్థ్యాలను శంకించే జమీందారులు రగడ, స్వదేశీ పాలకుల, అధికారుల సమస్యలు ఒకవైపు, అవమాన భారంతో రగిలిపోతున్న కంపెనీ పాలకుల కుయుక్తులు మరొకవైపు బేగం హజరత్‌ మహాల్‌ను చుట్టుముట్టాయి.
ఆ పరిస్థితులలో కూడా ఆమె ఏమాత్రం ఆధైర్యపడలేదు. ప్రజలను ఆకట్టుకుంటూ, స్వదేశీ పాలకులకు, తాలూకాదారులకు పలు రాయితీలు ప్రకటించారు. ఆ సమయంలో ఆంగ్లేయాధికారి జనరల్‌ హ్యాప్‌లాక్‌ తనకు లభించిన రెండు విజయాల తరువాత కూడా అవధ్‌ నుండి నిష్క్రమించటంతో బేగం శక్తిసామర్ధ్యాల మీద నమ్మ కం కుదిరిన స్వదేశీ పాలకులు, జమీందారులు తిన్నగా బేగం నాయకత్వం స్వీకరించి, నజరానాలు సమర్పించుకోవటం ఆరంభిం చారు. ఢిల్లీలోని మొగల్‌ చక్రవర్తి బహద్దూర్‌ షా జఫర్‌ ప్రతినిధిగా బిర్జిస్‌ ఖదీర్‌ తనను తాను ప్రకటించుకున్నారు. ఆయన ప్రతినిధిగా బిర్జిస్‌ ఖదీర్‌ అవధ్‌ పాలకునిగా పాలనను చేపట్టారు. కంపెనీ అధికారుల చర్యలతో నష్టపోయి కంపెనీ పాలకుల పట్ల ఆగ్రహంగా ఉన్న స్వదేశీయులు ఆయనను అవధ్‌ పాలకునిగా అంగీకరిం చారు. ఈ మేరకు అవసరమగు లాంఛనాలన్నీ పూర్తయ్యాయి.


ఆ అనుకూల వాతావరణంలో ప్రజల అవసరాలను తీర్చుతూ, శత్రువు దాడుల నుండి ప్రజలను కాపాడేందుకు లక్నో కోటను పటిష్ట పర్చే కార్యక్రమాలను బేగం చేపట్టా రు. ఆమె స్వయంగా తన లక్షలాది రూపాయలను వ్యయం చేసి కోటగోడలను పనర్మించారు. ప్రతి విషయాన్ని హజరత్‌ మహాల్‌ స్వయంగా పర్యవేక్షించసాగారు. ఆమె ఏనుగెక్కి పనులు సాగుతున్న ప్రదేశాలకు చేరుకుని స్వయంగా పర్యవేక్షించటంలో ప్రజలు- సైని కులు ఉత్సాహభరితులయ్యేవారు.

No comments:

Post a Comment