Wednesday 23 July 2014

వేదశాస్త్రాల ప్రకారం పునర్జన్మలున్నాయా?


పునర్జన్మ (పునర్+ జన్మ) అనే పదానికి మరల పుట్టుక అనే కాని మరల మరల పుట్టుక అని మాత్రం కాదు. మనషికి ఒకేసారి పుట్టుక వుంది. ఆ తర్వాత మరణం ఉంది. ఆ తరువాత ప్రళయం రోజున మరణించి శిధిలమైన మానవుణ్ణి అల్లాహ్ తిరిగి పుట్టిస్తాడు( సమాధుల నుండి బ్రతికించి లేపుతాడు). ఆ తరువాత అతని దగ్గర తనజీవితంలో చేసిన కర్మల లేక్కతీసుకుంటాడు. (నిజంగా జన్మచక్రము అనేది వుంటే గ్రంధాలలో చెప్పబడిన శాశ్వతస్వర్గము, శాశ్వతనరకము, అనే పదాలకు అర్ధం లెధు.) ఆ తర్వాత అతని జీవితం లో చేసిన కర్మల లెక్క తీసుకుంటాడు. అతని కర్మల ప్రకారం అతనికి శాశ్వతస్వర్గము, లేదా శాశ్వత నరకాన్ని నిర్ణయిస్తాడు.

పరలోకాన్ని వ్యతిరేకించే కొందరి నమ్మకాల్లో ఓ నమ్మకం "పునర్జన్మ" సిద్ధాంతం.ఈ విశ్వాసం లేక సిద్ధాంతం ప్రకారం మనిషి తన కర్మల సత్ఫలితాలను, దుష్ఫలితాలను అనుభవించడానికి ఈ లోకంలోనే పదే పదే జన్మిస్తాడని,తన కర్మల ఫలితంగా ఒకప్పుడు మనిషిగా జన్మిస్తే మరొక్కప్పుడు ఏదో ఒక జంతువుగానో,కీటకంగానో లేక చెట్టు చేమల రూపంలోనో జన్మించి మరల,మరల ఈ లోకంలోకే వస్తాడు అన్నది.ఈ సిద్ధాంతం ఓ కాలంలో బాగా ప్రాచుర్యం పొందింది.గ్రీకు,రోమన్లు ఈ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు.ఈజిఫ్ట్ ప్రాచీన చరిత్రలోను ఈ విశ్వాసం కానవస్తుంది.వీటి ప్రభావంగా ఓ కాలంలో యూదుల్లోను ఈ నమ్మకం వ్రేళ్లూనుకుంది.మన భారతదేశంలోని హిందువుల్లోను,జైనుల్లోను,
బౌద్ధుల్లోను దీనికి మంచి ప్రాచుర్యం లభించింది.ఈ పునర్జన్మ సిద్ధాంతానికి సంబంధించిన ఆలోచనలు,నమ్మకాలన్నిటినీ, ఆధునిక విజ్ఞాన శాస్త్రం,జీవితం గురించి నేడు తెలుసుకున్న యదార్ధాలు పూర్తిగా కొట్టిపారేశాయి.ఈ సిద్ధాంతాన్ని మనం విజ్ఞానం,తర్కం వెలుగులో సమీక్షిస్తే ఇది కేవలం ఓ అసత్యమైన నమ్మకం లేక సిద్ధాంతం అని చెప్పడంలో సందేహం ఏమాత్రం ఉండదు.


వేదాల్లో ఇలా ఉంది:

"వారు పరలోకాన్ని మరచి,బుద్ధీజ్ఞానాలను వదిలేసి మాచే నిర్ణయించబడ్డ హద్దులను దాటే ప్రయత్నం చేస్తున్నారు.ఋగ్వేదం
"గుర్రానికి ప్రతిదినం గడ్డి ఎలా కేటాయించబడుతుందో ఓ అగ్నీ!ధనాన్ని [కూడగట్టి]భద్రపరిచే వారి నుండి అంతిమ దినం నాడు నేను లెఖ్ఖ గైకొంటాను" [యజుర్వేదం

అల్లాహ్ ప్రళయ దినాన మిమ్మల్నందిరిని సమీకరిస్తాడు. ఇందులో ఎటువంటి సందేహానికి తావు లేదు. కాని తమను తాము నష్టం లో పడవేసుకున్నవారు మాత్రం విశ్వసించరు.
(ఖుర్ ఆన్ 6:12)

సమస్త ప్రాణి కోటి ప్రళయ కాలమున ప్రకృతిని జేరి అందు అణిగిఉండును. తిరిగి సృష్టి కాలమున వారిని మరల నేను సృజించుచున్నాను.
(భగవద్గీత 9:7)

దీనికి ఆశ్చర్యపడకుడి! ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున సమాదులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవన పునరుద్ధానమునకు, కీడు చేసినవారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వచ్చుదురు. (యోహాను 5:28, 29)

No comments:

Post a Comment