Thursday 24 July 2014

పెంచలకోన.....


దక్షిన భారతదేశంలోని ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా పెంచలకోన పేరుగాంచింది. భక్తుల కొంగు బంగారంగా శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి విశేష పూజలందుకొంటున్నారు. ఈ పుణ్యక్షేత్రం దర్శించుకోన్నవారి పాపాలు తొలగిపోతాయని భక్తులు భావిస్తారు. ఓంతో పాశస్ధ్యంగల శ్రీ లక్ష్మీ సమేత పెనుశిల లక్ష్మీనారసింహస్వామి భక్తుల ఇలవేల్పుగా మారారు. చెంచురాజు కుమార్తె చెంచు లక్ష్మీ సంచరించిన నాటి చెంచులకోనే నేటి పెంచలకోనగా పురాణాలు చెపుతున్నాయి. పుణ్యక్షేత్రాలలో ప్రసిద్దిగాంచిన మాత్రా స్దలం ఆనాటి చత్రవటి నరసింహక్షేత్రం నేటి శ్రీ పెనుశిల లక్ష్మీనరసింహస్వామి దేవస్ధానం.స్వామి వారికి వెండిగొడుగుల వాడని మరో పేరుంది. పెంచలకోన సమీపంలోని భైరవకోనకు స్వామి వ్యాహ్యాళికి వెళ్ళినప్పుడు మునులు స్వామి వారికి గోడుగులు పట్టేవారని అందువల్ల ఇప్పటికి ప్రతి వైశాఖ మాసంలో తెల్లటి వెండి గొడుగులు దర్శనిమిస్తాయని భక్తుల నమ్మకం. అందుకనే ఈ క్షేత్రాన్ని ఛత్రవటి క్షేత్రమని పిలుస్తారు. అందువల్ల బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు స్వామి వారికి మొక్కుబడిగా గొడుగులు సమర్పించుకుంటారు. ఈ ప్రాంతం చుట్టూ సుందరమైన సర్పాకృతి కలిగిన దట్టమైన చెట్లతో కూడిన కొండలు నడుమ ఆకర్షణియంగా దేవస్ధానం వెలసి వుంది. జిలా కేంద్రానికి 80 కిలో మీటర్ల దూరంలో సముద్రమట్టానికి 3వేల అడుగుల ఎత్తున వున్న కోన క్షేత్రం నిత్య శోభాయమానంగా వెలుగోందుతుంది.
.
తూర్పుకనుమల మధ్య పర్వత ప్రాంతాలల్లో నెల్లూరు-కడప జిల్లాల మద్య ఈ క్షేత్రం వుంది. ఈ క్షేత్రం

దట్టమైన కీకారణ్యంలో వున్నప్పటికి ఇక్కడికి వచ్చే భక్తులకు ఎటువంటి ఆపదలు క్రిమి కీటకాలనుండి తలెత్తవు. అందువల్ల ఈ స్వామిని కొండి కాసులవాడని కూడా పిలుస్తారు.దుష్ట శిక్షణ-శిష్ట రక్షణ చేయు శ్రీ మహావిష్ణువు కృతయుగాన ప్రహ్లాదుని రక్షించేందుకు హిరణ్యకసిపుని సంహరించిన అనంతరం వెలిగోండల కీకారణ్యంలో గర్జిస్తూ ఆవేశంగా సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమార్తె చెంచులక్ష్మీ తన చెలికత్తెలతో అడవిలో విహరిస్తుండగా స్వామి వారి భీకర రూపాన్ని చూసిన చెలికత్తెలు భయంతో పారిపోగా చెంచులక్ష్మీ మాత్రం స్వామి వారిని చూసి భయపడకుండా నిలబడి పోయినట్లు చరిత్ర చెపుతుంది. దీంతో ఆమే
.
ధైర్య సాహసాలు,అందచందాలకు ముగ్ధుడైన స్వామి వారు చెంచురాజుకు కప్పం చెల్లించి ఆమెను వివాహం చెచుకోని ఆ సుందరవనితను పెనవెసుకోని శిలారూపంలో ఇక్కడ స్వయంభువుగా వెలసినట్లు పూరాణ కధనం. దీంతోనే స్వామి వారిని పెనుశిల లక్ష్మీనసింహస్వామిగా పిలుస్తారు. అయితే చెంచులక్ష్మీని స్వామి వివాహమాడారని తెలుసుకున్న ఆయన సతి ఆదిలక్ష్మీ అమ్మవారు ఆగ్రహించి స్వామికి అల్లంత దూరంలో ఏటి అవతల గట్టుకు వెళ్ళిపోయినట్లు కధనం. దీంతో అమ్మవారికి ఇక్కడ దేవస్ధానం నిర్మించారు. భారతదేశానికి ఈ పేరు రావడానికి కారణమైన భరతుడు ఈ ప్రాంతంలోనే
పెరిగారని ఆయనను పెంచిన కణ్వమహర్షి ఈ ప్రాంతంలో తపస్సు ఆచరించారని ఆశ్రమం పక్కనే వున్న ఏరును కణ్వలేరుగా పిలిచేవారని కాలక్రమేణా అది కండలేరుగా మారినట్లు చరిత్రకధనం. పెంచలకోనకు ఆరు కిలో మీటర్ల దూరంలో గోనుపల్లికి చెందిన ఒక గోర్రెల కాపరి గొర్రెలను మేపుకునేందుకు పెంచలకోన అడువులలోకి వెళ్లగా ఒక రోజు ఆయనకు స్వామి వృద్ధుని రూపంలో కనిపించి నరసింహస్వామి శిలా రూపంలో ఇక్కడ వెలసి వున్నారని గ్రామస్దులకు తెలిపి ఇక్కడ ఆలయం నిర్మించాలని వారికి తెలిపాలని వెనుతిరిగి చూడకుండా వెళ్లాలని స్వామి అతనిని ఆదేశించగా కాపరి సరేనని కోద్ది దూరం వెళ్ళిన తరువాత వెనుతిరిగి చూడడంతో శిలగా మారినట్లు ఈప్రాంత వాసులు చెపుతుంటారు.


విషయం తెలుసుకున్న గ్రామస్దులు స్వామి వారికి దేవస్ధానం నిర్మించి పూజా కార్యక్రమాలు
నిర్వహిస్తున్నారు. కోనలోని గర్భగుడి సుమారు 700 సంవత్సరాలకు పూర్వం నిర్మించినట్లు తెలుస్తుంది.1959లో ఈ దేవస్ధానం దేవాదాయ శాఖ ఆధీనంలోకి వచ్చింది. అప్పటి నుండి కోన దినదినాభివృద్ధి చేందుతూ వుంది.

No comments:

Post a Comment