Friday 28 February 2014

చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ద్థంతి నేడు!!



భారత స్వాతంత్ర్యోద్యమంలో దేశమాత విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి అమరుడైన వీరుడు చంద్రశేఖర్ ఆజాద్. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్, పండిత్ రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, ప్రేమ్ కిషన్ ఖన్నా మరియు అష్ఫాకుల్లా ఖాన్‌ల సహచరుడిగా బ్రిటీషువారి గుండెల్లో రైల్లు పరిగెత్తించిన ఈయన మనదేశం గర్వించదగ్గ అసమాన వీరుడు.

భగత్ సింగ్ మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచిన ఆజాద్ పూర్తిపేరు చంద్రశేఖర సీతారామ్ తివారి. ఈయన పండిత్‌జీగా కూడా పిలువబడ్డారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఝాబువా జిల్లా, బావ్రా (భాబ్ గా) గ్రామంలో పండిట్ సీతారామ్ తివారి, జగరానీ దేవీలకు 1906 జూలై 23వ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ జన్మించారు. ప్రాథమిక విద్యను సొంత గ్రామంలోనే పూర్తి చేసిన ఈయన వారణాసిలో సంస్కృత పాఠశాలలో హయ్యర్ సెకండరీ విద్యను అభ్యసించారు.

1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్ వాలాబాగ్ దుర్ఘటనతో తీవ్రంగా కలతచెందిన ఆజాద్.. ఆ తరువాత 1921లో మహాత్మాగాంధీ నడిపిన సహాయ నిరాకరణోద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న నేరానికిగానూ ఈయన తన పదిహేనేళ్ల ప్రాయంలోనే అరెస్టయ్యారు.

విచారణ సందర్భంగా కోర్టులో "నీ పేరేంటి?" అని మెజిస్ట్రేట్ అడిగిన ప్రశ్నకు ఆయన పెద్ద శబ్దంతో "ఆజాద్" అని అరచి చెప్పారు. దాంతో ఆయనకు మెజిస్ట్రేట్ 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. అయితే ప్రతి కొరడా దెబ్బకు ఆయన భారత్ మాతాకీ జై (వందేమాతరం) అంటూ గొంతెత్తి నినదించారు. ఇక అప్పటినుంచి చంద్రశేఖర్ ఆజాద్‌గా ఆయన పేరు స్థిరపడిపోయింది.

సహాయ నిరాకరణోద్యమం ఆజాద్‌లో దాగి ఉన్న విప్లవవాదిని మేల్కొలిపింది. ఎలాగైనా సరే భారతదేశాన్ని బ్రిటీష్‌వారి కబంధ హస్తాల నుంచి విడిపించాల్సిందేనని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు. అనుకున్నదే తడవుగా ఆయన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్‌ను స్థాపించారు. భగత్ సింగ్, సుఖదేవ్, తదితరులకు మార్గనిర్దేశకుడిగా మారారు.

1928వ సంవత్సరంలో పోలీసుల దాడిలో తీవ్రంగా గాయపడి కన్నుమూసిన 'పంజాబ్ కేసరీ లాలాలజపతిరాయ్ మృతికి ప్రతికారంగా రాజ్ గురు, భగత్ సింగ్, బ్రిటీష్ పోలీస్ అధికారి సాండర్స్ ను కాల్చి చంపగా, సాండర్స్ వెంట వచ్చిన హెడ్ కానిస్టబులు రాండ్ ను అజాద్ కాల్చి చంపాడు. ఉత్తర ప్రదేశ్, పంజాబ్ ప్రభుత్వాలు ఆజాద్ ను సజీవంగా పట్టుకునే ప్రయత్నం చేశాయి. అతనిని ప్రాణాలతో తీసుకువచ్చినా లేక చంపి తెచ్చినా 30 వేల రూపాయలు బహుమతిగా ప్రకటించారు. అ రోజు 1931, ఫిబ్రవరి 27, శుక్రవారం అలహాబాదులోని ఆల్ఫ్రెడ్ పార్క్‌కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్‌ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు లొంగకుండా, ఒక్కడే పోరాడుతూ ముగ్గురు పోలీసులను హతమార్చారు. అలసిపోయేదాకా పోరాడిన ఆయన చివరి క్షణంలో తన వద్ద మిగిలిన ఒకే ఒక్క బుల్లెట్‌తో తనను తానే కాల్చుకుని అశువులు బాసారు.

Thursday 27 February 2014

వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి చరిత్ర.............


పరాయి పాలకుల అణచివేతపై తిరుగుబాటు జరిపి మాతృభూమిస్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించడానికిసైతం వెనుకాడకుండా భారతవీరులు పోరాటం ప్రారంభించిన కాలఘట్టం అది. వ్యాపారం కోసమని వచ్చిన ఆంగ్లేయులు తమ ఈస్‌‌ట ఇండియూ కంపెనీ ద్వారా దేశాన్ని వశపరచుకోవడం ప్రారంభించారు. అది 1857వ సంవత్సరం.
 అంతవరకు లోలోపల రగులుతూన్న తిరుగుబాటు జ్వాల ఒక్కసారిగా అగ్నిపర్వతంలా బద్దలయింది. దురాక్రమణదారులు స్థానిక సంస్థానాలను ఏదో ఒక నెపం మీద ఆక్రమించుకోసాగారు. అలా వాళ్ళు ఝాన్సీ మీద దాడిని ప్రారంభించారు. అప్పుడు ఝాన్సీ కోట బురుజులపై నుంచి ఒక కంఠస్వరం ఉరుములా ఉరిమింది: ‘‘ఝాన్సీని వదులుకోవడమా? అసంభవం! ఎన్నటికీ సాధ్యపడదు. దమ్ములున్న వాడు ప్రయత్నించనీ!'' అలాంటి దృఢనిర్ణయంతో గర్జించింది ఏ రాజో కాదు.పట్టుమని ఇరవైయేళ్ళు కూడా నిండని ఝాన్సీరాణి లక్ష్మీబాయి






ఝాన్సీ లక్ష్మీబాయి (నవంబరు 19 1828 – జూన్ 17 1858) , మరాఠా యోధులు పరిపాలన కింద ఉన్న ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857 లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామం లో ప్రముఖ పాత్ర పోషించింది. భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన లో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటుదార్లలోముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు. మరియు భారత దేశంలోని బ్రిటిష్ పరిపాలన ను అడ్డుకొన్న వాళ్లకి ఈమె గుర్తుగా నిలిచారు. భారత దేశం యొక్క "జాయన్ ఆఫ్ ఆర్క్" లాగా ఆమె భారత దేశ చరిత్రలో ఒక గొప్ప వ్యక్తిగా నిలిచిపోయింది.



బాల్య జీవితం:-
ఝాన్సీ లక్ష్మీబాయి అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు 19 న మహారాష్ట్ర కు చెందిన సతర లో ఒక కర్హాడీ బ్రాహ్మణుల వంశంలో వారణాసి లో విక్రమ నామ సంవత్సరం బహుళ చతుర్దశి నాడు జన్మించింది. డీ.బీ పరాస్నిస్ అనే చరిత్రకారుడు రాణీ నవంబర్ 19, 1835 వసంవత్సరంలో జన్మించినట్లు ఆమె జీవిత చరిత్రలో పేర్కొన్నాడు. కానీ దీనికి వేరే చారిత్రక ఆధారాలు లేకపోవడం వలన 1828 అన్ని చోట్లా ఆమోదింపబడుతున్నది. దీనికి ఆధారం 1854లో జాన్ లాంగ్ అనే ఆంగ్లేయుడు రాణిని కలవడానికి వెళ్ళినపుడు ఆమె తరుపు గుమస్తా ఆయనకు రాణీ 26 ఏళ్ళ స్త్రీ అని చెప్పడం జరిగింది.
ఈమె తల్లిదండ్రులు మోరోపంత్ తాంబే మరియు భాగీరథీబాయి లు. వీళ్ళది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం. ఆమె తల్లి చాలా తెలివైనది మరియు ఆధ్యాత్మిక దోరణి మెండు గా కలది. రాణి అసలు పేరు మణికర్ణిక కాగా ఆమె ను ముద్దుగా మను అని పిలుచుకునేవారు. ఆమె తల్లి రాణి నాలుగేళ్ళ ప్రాయంలో ఉండగానే కన్ను మూసింది. దాంతో ఆమెను పెంచాల్సిన బాధ్యత తండ్రి మీద పడింది.

ఇలాంటి క్లిష్ట సమయంలో బాజీరావు పీష్వా మోరోపంత్ ను బిఠూర్ కు పిలిపించి ఆశ్రయమిచ్చి ఆదుకున్నాడు. బాజీరావు కు సంతానం లేకపోవడంతో నానా సాహెబ్ అనే బాలుని దత్తత చేసుకున్నాడు. నానా సాహెబ్, అతని పినతండ్రి కుమారుడు రావు సాహెబ్ మనూబాయిని తమ చెల్లెలిగా ఆదరించారు. వీరు ముగ్గురూ కలిసే విద్యలన్నీ నేర్చుకున్నారు. కత్తిసాము, గుర్రపుస్వారీ, తుపాకీ పేల్చడం వండి విద్యలంటే మనూకు మక్కువ ఎక్కువ. ఖడ్గం ధరించి, కళ్ళెం బిగించి గాలి విసురుకు ఉవ్వెత్తుగా ఎగిరే కురులతో గుర్రపు స్వారీ చేస్తూ నానా సాహెబ్ వెంట మనూబాయి దుసుకొని పోయేది.






వివాహం:-

లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842 లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది. దీంతో ఆమె ఝాన్సీ పట్టణానికి మహారాణి అయింది. అప్పటి ఆచారాల ప్రకారం మహారాణి అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మీబాయి అయింది. 1851లో లక్ష్మీబాయి ఒక కుమారునికి జన్మనిచ్చింది. అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. 1853 లో గంగాధర రావుకు విపరీతమైన అనారోగ్యం సోకింది. వేరే బిడ్డను ఎవరినైనా దత్తత తీసుకోమని అందరూ సలహ ఇచ్చారు. దాంతో ఆయనకు దూరపు బందువైన వాసుదేవ నేవల్కర్ కుమారుడైన దామోదర్ రావు అనే పిల్లవాడిని చనిపోవడానికి కేవలం ఒక్క రోజు ముందుగానే దత్తత తీసుకున్నారు. 1853, నవంబర్ 21వ తేదీన గంగాధరరావు మరణించాడు.


ఆక్రమణ


వివాహం తరువాత ఆమె పేరు లక్ష్మిబాయిగా మార్చబడినది. సభలో ఆమె తండ్రికున్న ప్రాభల్యం వలన, మిగిలినిన యువతులు, ఎవరైతే జెనన కి నిర్భంధం చేయబడి ఉంటారో, వాళ్ళకంటే ఎక్కువ స్వాతంత్ర్యం ఈమెకు వుండేది.ఆమె సాయుధ దళం, గుర్రపుస్వారీ, విలువిద్యలలో ప్రావీణ్యం సంపాదించింది, అంతే కాకుండా తన స్నేహితురాల్లందరినీ చేర్చుకొని సభలో ఒక సైన్యాన్ని తయారుచేసింది.
1851 లో రాణి లక్ష్మిబాయి తన కుమారుడికి జన్మనిచ్చింది, కాని అతను తన నాలుగు నెలల వయస్సులోనే చనిపోయాడు. తమ కుమారుడు చనిపోయిన తరువాత , ఝాన్సీ యొక్క రాజు మరియు రాణి దామోదర్ రావు అనే పిల్లవాడిని దత్తత తీసుకొన్నారు. కాని రాజు అయిన ఆమె భర్త తన కుమారుడి మరణం నుంచి తేరుకోలేక , 21 నవంబర్ 1853 లో పగిలిన హృదయముతో చాలా బాధ పడుతూ చనిపోయాడని చెప్పబడింది. వీరు దత్తత తీసుకునే సమయానికి డల్హౌసీ భారత గవర్నర్ జనరల్ గా ఉన్నాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం దామోదర్ రావు రాజ్యానికి వారసుడు కావల్సి ఉన్నా బ్రిటీష్ ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దామోదర్ రావు రాజా కు రక్త సంబంధం కానందువలన అంటే దత్త సంబంధం కావున, ఈస్ట్ ఇండియా కంపనీ గవర్నర్-జెనరల్ లార్డ్ డెల్ హౌసి, సిద్ధాంతం ప్రకారం రావు సింహాసనాన్ని అధిష్టించే అధికారం లేదని అతనిని నిరాకరించాడు. దాంతో లక్ష్మీ బాయి ఈస్ట్ ఇండియా కంపెనీ కి చెందిన ఒక లాయర్ రాబర్ట్ ఎల్లిస్ ను సంప్రదించి లండన్ కోర్టులో దావా వేసింది. ఆ లాయరు కేసును చాలా చక్కగా వాదించినా లాభం లేకపోయింది. కేసును కోర్టు కొట్టివేసింది. ఆంగ్లేయులకు రాణి మీద కక్ష కలిగింది. వారి రాజాభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మార్చి 1854 లో రాజు ఋణపడిఉన్న 60 వేల రూపాయలను ఆమెకు లభించే పెన్షన్ నుంచి తీసేసుకున్నారు. ఆమె తక్షణం ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళాల్సిందిగా ఆదేశించారు. కానీ రాణి అందుకు సమ్మతించలేదు. తాను ఝాన్సీ పట్టణాన్ని విడిచి వెళ్ళేది లేదని ప్రతిజ్ఞ పూనింది.




గొప్ప తిరుగుబాటు:-


రాణి ఝాన్సీ ని ఇవ్వకూడదని నిశ్చయించుకొన్నది. ఆమె తన సైన్యాన్ని బలపర్చి మరియు తమకు తాముగా వచ్చిన వాళ్ళను పోగుచేసి ఒక సేనను తయారుచేసింది. మహిళలకు కూడా యుద్ధ శిక్షణ ఇవ్వబడినది. యుద్ధ వీరులైన గులాం గాస్ ఖాన్ , దోస్త్ ఖాన్, ఖుదా బక్ష్, లాల భు బక్షి, మోతీ బాయి , సుందర్-ముందర్ , ఖాసి బాయి, దీవాన్ రఘునాథ్ సింగ్, మరియు దీవాన్ జవహర్ సింగ్ రాణి బలగంలో ఉన్నారు.
1857 స్వాతంత్ర్య పోరాటం:-




                              అప్పటి వరకు, బ్రిటిష్ కు వ్యతిరేకంగా తిరుగుబాటుకు సంశయించిన కాని,జూన్ 8 1857 జోఖన్ బాఘ్ లో బ్రిటిష్ HEIC అధికారుల, వాళ్ళ భార్య, పిల్లల "జన సంహారం" లో ఆమె పాత్ర ఇంకా ఒక వివాదాస్పదము గానే నిలిచిపోయింది.చివరికి మార్చి 23 1858 లో బ్రిటిష్ బలగాలు సర్ హుఘ్ రోజ్వశములో ఝాన్సీ ని ఆక్రమించుకున్నప్పుడు ఆమె సంశయం తీరిపోయింది. ఆమె యుద్ధ వీరులతో కలిసి లొంగ కూడదని ఆమె నిర్ణయించుకొంది. యుద్ధము సుమారు రెండు వారాలు జరిగింది. ఝాన్సీ నిర్మూలన చాలా భయంకరమైనది. ఝాన్సిలో మహిళా సైన్యం కూడా యుద్ధ సామగ్రిని మరియు తిను భండరములను సిపాయిలకు అందించేవారు. రాణి లక్ష్మిబాయి చాలా చురుకుగా ఉండేది. ఆమె నగర రక్షణను తనే స్వయంగా పరిశీలించేది.


                           ఝాన్సీ లో ఇవన్నీ జరుగుతున్నపుడు, మే 10,1857 లో మీరట్ లో భారత సిపాయిల తిరుగుబాటు మొదలైంది. బ్రిటిష్ కి వ్యతిరేకంగా ఇది మొదటి తిరుగుబాటుగా నిలిచింది. పందులంటే ముసల్మానులకు ద్వేషమని, హిందువులకు ఆవులంటే పవిత్రమైనవని తెలిసినా కాని,వాళ్ళు యుద్ధములో తుపాకి గుండ్లు తగలకుండా వేసుకొనే తొడుగులకు, మరియు వాళ్ళు వాడే తుపాకీలకు పందుల మరియు ఆవుల కొవ్వుని పూసారు. బ్రిటిష్ అధికారులు వాళ్ళను వాటిని వాడవల్సిందిగా బలవంత పరిచి ,ఎవరైతే వినలేదో వాళ్ళని శిక్షించడం మొదలుపెట్టారు. ఆ తిరుగుబాటు సమయంలో చాలా మంది బ్రిటిష్ ప్రజలు, మహిళలు,పిల్లలు సిపాయిల చేతిలో చంప బడిన వాళ్ళలో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఈ తిరుగుబాటును త్వరగా ముగించాలనుకొన్నారు.


                                                          ఇంతలో, మే 1857, లో భారత దేశం లో కలవరం ప్రాకడం మొదలైంది, ఉత్తర ఖండంలో మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధం మొదలైంది. ఈ క్లిష్ట పరిస్థితులలో ,బ్రిటిష్ వాళ్ళు ఇంకెక్కడో వాళ్ళ ధ్యానాన్ని కేంద్రీకరించవలసినదిగా నిర్భందం రావడంతో ,ఝాన్సీ ని లక్ష్మిబాయి పరిపాలించవలసిన అవసరం ఏర్పడింది. ఈ సమయంలో ఆమె తన సత్తాని చాలా వేగంగా ప్రదర్శించి ఝాన్సీ యుద్ధానికి సేనలను సమర్థవంతంగా తయారుచేసింది. ఈ తన సమర్థత కారణం వలన లక్ష్మిబాయి మధ్య కాలంలో వచ్చిన సామ్రాట్ల కలవర సమయములో కూడా ఝాన్సిని శాంతియుతంగా ఉంచగలిగింది.

                                        ఆమె తన బలగాలను తన చుట్టూ ఏర్పరచుకొని బ్రిటిష్ కి వ్యతిరేకంగా చాలా భయంకరంగా యుద్ధం చేసింది. ఝాన్సీ కి స్వేచ్చ కలిగించి లక్ష్మిబాయి ని స్వతంత్రుపరురాలు చేయటానికి తిరుగుబాటు దార్ల నాయకుడైన తాత్యా తోపే ఆధ్వర్యములో 20,000 మంది సైన్యం పంపబడింది. మార్చి 31 లో బ్రిటిష్ వాళ్ళ దగ్గర లెక్కకి 1,540 సిపాయిలు మాత్రమే ఉన్నాకాని , "ఏ శిక్షణ లేని వాళ్ళ కంటే" వీళ్ళు చాలా శిక్షణ పొందినవాళ్ళు, మరియు క్రమశిక్షణ కలిగిన వాళ్ళు కావడంతో ,బ్రిటిష్ వాళ్ళు ఆక్రమణ మొదలు పెట్టడంతో, ఈ అనుభవం లేని సిపాయిలు పారిపోయారు. లక్ష్మిబాయి బలగాలు బలహీనమవడంతో మూడు రోజుల తరువాత బ్రిటిష్ వాళ్ళు నగర గోడలను చీల్చుకొని నగరాన్ని ఆక్రమించుకోగలిగాయి. ఆమె తన రక్షకులు చుట్టూ ఉండడంతో ఆ రాత్రి గోడ దూకి నగరం నుంచి పారిపోగలిగింది,ఆ రక్షకులలో చాలా మంది తన మహిళా సైన్యం నుండి ఉన్నవారే.

1857లో అలజడి రేగడంతో ఝాన్సీ పట్టణం విప్లవ కారులకు నిలయంగా మారింది. లక్ష్మీబాయి స్వచ్చంద సైన్యాన్ని సమీకరించడం ద్వారా ఆత్మరక్షణ బలోపేతం చేసింది. మహిళలను కూడా సైన్యంలో చేర్చుకుని వారికి ఆయుధ శిక్షణను ఇవ్వనారంభించింది. ఆమె దగ్గర సైన్యాధ్యక్షులుగా ఉన్న వారంతా ఆమె యుద్ధం చేస్తున్న కారణానికి మద్దతుగా స్వచ్చందంగా ముందుకు వచ్చిన వారే. సెప్టెంబర్ మరియు అక్టోబర్ 1857 లో ఆమె ప్రక్క రాజ్యాలైన దతియా మరియు ఓర్చా రాజ్యాల నుంచి దాడిని విజయవంతంగా ఎదుర్కొనగలిగింది.
                                  
                                     జనవరి 1858 లో బ్రిటిష్ సైన్యం ఝాన్సీ ని ముట్టడించడం ప్రారంభించింది. రెండు వారాల పోరాటం తర్వాత ఆంగ్లేయులు నగరాన్ని చేజిక్కించుకోగలిగారు. కానీ రాణి మాత్రం మగ వేషంలో దత్తత తీసుకున్న చిన్న బిడ్డను వీపున తగిలించుకుని వారి కన్నుగప్పి పారిపోయింది. కల్పి అనే ప్రదేశానికి చేరుకునితాంతియా తోపే అనే విప్లవ కారుణ్ణి కలుసుకోగలిగింది.
ఆమె, చిన్నవాడు అయిన దామోదర్ రావు, మరియు తన బలగాలతో కల్పి కి పారిపోయి తాత్యా తోపే ఉండే తిరుగుబాటు దారులతో చేరింది. రాణి మరియు తాత్యా తోపే గ్వాలియర్ కు వెళ్లి తమ తిరుగుబాటు బలగాలను ఒకటి చేసి గ్వాలియర్ మహారాజ సైన్యాన్ని ఓడించి తమ బలగాలతో వాళ్ళను పూర్తిగా నశించి పోయేలా చేసారు. తరువాత వాళ్ళు కపటోపాయముతో గ్వాలియర్ కోటను ఆక్రమించుకొన్నారు. కాని,17 జూన్ 1858 , లో రెండో రోజు యుద్ధములో రాణి మరణించింది.ఈమె మరణానికి కారణమైన పరిస్థితుల గురించి చాలా వాదనలున్నాయి. ఇప్పటి బ్రిటీష్ రిపోర్టులను బట్టి ఆమె బుల్లెట్ గాయాలు తగిలి మరణించిందని తెలుస్తోంది. టి.ఎ మార్టిన్ రాసిన లేఖ ఆధారంగా ఈ విషయం తెలుస్తోంది.


“ తనతో పాటు ఆమెను తీసుకు వెళ్తానన్న తాంతియా తోపే సహాయాన్ని తిరస్కరిస్తూ ఆమె ఒక నిచ్చెన ను తెమ్మని పురమాయించింది. దాని సహాయంతో దగ్గరే ఉన్న గడ్డి వామి పైకి ఎక్కి దాన్ని తగుల బెట్టమని చెప్పింది. ఆమె అనుచరులు అలాగే చేశారు. ఇది ఫూల్ భాగ్ వద్దనున్న గుసైన్ బాగ్ వద్ద జరిగింది. నేను అక్కడికి వెళ్ళి చూశాను. ”


తర్వాత మూడు రోజులకు బ్రిటీష్ వారు గ్వాలియర్ ను చేజిక్కించుకున్నారు. గ్వాలియర్ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ విప్లవ కారుల్లోకెల్లా ఆమే అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని కితాబిచ్చాడు. దాని వల్లనే ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది.



మరణం:-

ఆమె 18 జూన్ , 1858 లో గ్వాలియర్ తో యుద్ధ సమయములో తన ఎనిమిదొవ యుద్ధ గుర్రంతో మరణించింది, అది గ్వాలియర్లోని ఫూల్ బాఘ్ దగ్గర కోతః-కి-సేరి లో జరిగింది. ఆమె యుద్ధ వీరులకు యుద్ధ బట్టలు తొడిగించి గ్వాలియర్ కోటను రక్షించటానికి యుద్ధానికి తీసుకెళ్ళింది,ఇది ఇప్పుడు ఉత్తర ప్రదేశ్లోఉండే లక్నోకి పడమరగా 120 మైళ్ళ దూరంలో ఉంది. మూడు రోజుల తరువాత బ్రిటిష్ వాళ్ళు గ్వాలియర్ ను ఆక్రమించుకొన్నారు. గ్వాలియర్ యుద్ధ నివేదిక ప్రకారం , గెనరల్ సర్ హుఘ్ రోస్ ఆమెని "చాలా చెప్పుకోదగిన అందమైనది,తెలివైనది, మరియు పట్టుదల కలది"అని "తిరుగుబాటు నాయకులలో కెల్లా అతి భయంకరమైనది" అని విర్శించారు.
కాని , కొరతగా ఉన్న శవాన్ని గుర్తించి, అది రాణి అని నమ్మించారని " పరాక్రమ" పటాలముగా చెప్పబడే ఆమె గ్వాలియర్ యుద్ధంలో చనిపోలేదని కెప్టన్ రీస్ నమ్మబడి , "[ది] ఝాన్సీ మహారాణి బ్రతికే ఉంది!" అని బహిరంగంగా ప్రకటించాడు. ఆమె ఎక్కడైతే మరణిచిందో అక్కడే అదే రోజు ఆమెకు అంత్య క్రియలు జరిగాయని నమ్మకం. ఆమె పరిచారికలలో ఒకరు అంత్యక్రియల సన్నాహాలకు సహాయపడింది.
ఆమెకున్న ధైర్యము, పరాక్రమము, మరియు వివేకము, భారత దేశంలో 19 వ శతాబ్దములో మహిళలకున్న అధికారం పై ఆమెకున్న ముందుచూపు , మరియు ఆమె చేసిన త్యాగాలు ఆమెని స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రసిద్ధ వ్యక్తిగా నిలిపింది. ఝాన్సీ మరియు గ్వాలియర్ లలో ఆమె గుర్తుగా కంచువిగ్రహాలను స్థాపించారు,రెండింటిలోను ఆమె గుర్రం పైన కూర్చున్నట్టుగా చిత్రీకరించారు.

ఝాన్సీ అధికారం పోయిన కొన్ని రోజులకే ఆమె తండ్రి అయిన, మోరోపంత్ తమ్బేని పట్టుకొని ఉరితీసారు. .తన దత్త పుత్రుడైన దామోదర్ రావు , బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భరణం ఇవ్వబడ్డాడు , కాని అతనెప్పుడు తమ పిత్రార్జితాన్ని అందుకోలేదు.

Wednesday 26 February 2014

16-Aug-1947 First News of Independent INDIA from the newspaper hindustan times... A Very Rare Photo...


సంతు మీరాబాయి చరిత్ర.......


రాజపుత్ర యువరాణి మీరాబాయి వాయువ్య భారతదేశపు రాజస్థాన్లోని ప్రస్తుతం నాగపూర్ జిల్లాలో ఉన్న మెర్టా దగ్గరి చిన్న పల్లెటూరు కుడ్కీ (కుర్కీ) లో జన్మించింది. ఆమె తండ్రి రతన్ సింగ్ రాథోడ్.
మీరా చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒక సాధువుని కలిసినప్పుడు ఆయన ఇచ్చిన కృష్ణుడి విగ్రహాన్ని ఘాడంగా మోహించింది, దీనిని ఆమె జీవితాంతం ఆమె దగ్గరే ఉంచుకుంది. ఆమె తల్లి ఆమె ఆధ్యాత్మిక భావనలకు మద్ధతునిచ్చేది కానీ ఆమె త్వరగా చనిపోయారు.

మీరా వివాహం ఆమె చిన్న వయస్సులోనే చిత్తోడ్ రాణా సంగా పెద్ద కొడుకు భోజ్ రాజ్ యువరాజుతో సాంప్రదాయబద్ధంగా నిశ్చయించబడింది. కాని తనని తానూ శ్రీ కృష్ణుని భార్యగా భావించుకునే మీరాకు ఈ వివాహం సంతోషం కలిగించలేదు. ఆమె కృష్ణుణ్ణి మాత్రమే నిజంగా పెళ్ళి చేసుకున్నానన్న భావనలో ఉండేది. ఆమె తననితాను కృష్ణుడి ప్రేమలో పిచ్చిదైన 'గోపిక లలిత' పునర్జన్మగా భావించేది.
మిరాబాయికి ప్రాపంచిక సుఖాలమీద విరక్తి కలిగింది. శ్రీకృష్ణునిపై విశ్వాసం, భక్తి స్థిరపడిపోయింది. తరచు దివ్యోన్మాదంతో తన్మయం పొందుతూండేది. దేవాలయంలో శ్రీకృష్ణుని దివ్య విగ్రహహం ముందు కూర్చుని కూర్చి పాడుతూండేది. ఈమెపాడే పాటలకు ముగ్ధులై అనేక మంది భక్తులు చేరేవారు. ఏమే పారమార్థిక జీవితం ఉపద్రవకరంగా ఉందని రాజవంశీయులు తమ గౌరవాన్ని నిలబెట్టుకోడానికి ఈమెను హత్యచేయడానికి ప్రయత్నించారు.
ఒక బుట్టలో పామును పెట్టి పూవులదండ అని చెప్పి ఆమె ఆ పామును పూలమాలగా కంఠంలో ధరించింది.మరొకసారి ఒక చిన్న బంగారుగిన్నెలో విషం కలిపిన పాలు ఇచ్చారు. నిర్భయంగా ఆ పాలను త్రాగింది.

 

ఒకానొక సమయంలో మీరా కృష్ణాయిజానికి కేంద్రమైన బృందావనానికి వెళ్ళిపోయింది. ఇందులో ఒకచోట ఆమె ఆ సమయంలో బృందావనంలో గురు సాధువు చైతన్య ప్రత్యక్ష అనుయాయి రూపా గోస్వామితో ఆధ్యాత్మిక విషయాలను గురించిన చర్చ జరపాలన్న కోరిక వెలిబుచ్చింది, ఘోటక బ్రహ్మచారి అయిన ఆయన ఒక స్త్రీని కలవడానికి నిరాకరించారు. దీనికి మీరా ఈ విశ్వంలో నిజమైన పురుషుడు కేవలం కృష్ణుడు మాత్రమే అని బదులిచ్చింది. ఆమె తన తీర్థయాత్రను కొనసాగిస్తూ "ఒక గ్రామంనుంచి ఇంకొక గ్రామానికి నాట్యం చేస్తూ వెళుతూ దాదాపు మొత్తం ఉత్తర భారతాన్నంతా చుట్టింది". ఆమె తన జీవిత చరమాంకాన్ని భక్తురాలిగా గుజరాత్ లోని ద్వారకలో గడిపింది.
కృష్ణుడితో కలయికకై ఆమె పడే తపన ఆమె కవిత్వంలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆమె "నీలపు రంగు కావాలని" (కృష్ణుడి రంగు) కోరుకొనేది. ద్వారకలో మీరా శ్రీకృష్ణ విగ్రహం ముందు నిలిచి వెళ్ళడానికి అనుజ్ఞ ఇమ్మని వేడుకుంది. నాట్యంచేసి శ్రీకృష్ణునిపై రచించిన భక్తి పాటలు పాడింది. శ్రీకృష్ణ విగ్రహం పాదాలపై బడి పాదాలను కళ్ళకు అద్దుకుంది. చూస్తూండగానే శ్రీ కృష్ణ విగ్రహంతో ఐక్యమైపోయింది.

Tuesday 25 February 2014

మన చరిత్ర...మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని బయటి ప్రపంచానికి చాటి చెప్పింది........

192 కిలోమీటర్ల పొడవు...

192 కిలోమీటర్ల వెడల్పు..

36864 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం..

బారులు తీరిన వీధులు..

వీధుల వెంట బారులు తీరిన చెట్లు..

రాయల్‌ ప్యాలెస్‌లు..

రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌లు..

కమర్షియల్‌ మాల్స్‌..

కమ్యూనిటీ హాల్స్‌..

క్రీస్తుపూర్వం నాలుగు వేల సంవత్సరాల నాడే

అపూర్వ మహానగరం..

రత్నస్తంభాలు..

వజ్ర తోరణాలు..

సాటిలేని ఆర్కిటెక్చర్‌..

సముద్రం మధ్యలో మహా నిర్మాణం..

జగన్నాథుడి జగదేక సృష్టి..

క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల నాటి

లెజెండ్‌ సిటీ...

ద్వారక..

ఇప్పుడు సాగర గర్భంలో..

మన నాగరికత..

మన సంస్కృతి..

మన ప్రతిభకు పట్టం కట్టిన

నాటి కాస్మోపాలిటన్‌ సిటీ..


ద్వారక
----------------------------
అవును, రామాయణం నిజం.. మహా భారతం నిజం.. ద్వాపర యుగం నిజం.. వేల ఏళ్ల నాటి మన సంస్కృతి నిజం.. అద్భుతమైన మన నాగరికత నిజం.. అపూర్వమైన మన సైన్స్‌ నిజం.. సాటి లేని మన ఇన్వెన్‌షన్స్‌ నిజం.. ఇందుకు ఈ సముద్ర గర్భంలో కనిపిస్తున్న మహానగరమే తిరుగులేని ఉదాహరణ.. ఒక్కమాటలో చెప్పాలంటే.. ద్వారక.. గోల్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియా..

1980వ దశకంలో గుజరాత్‌ సముద్ర తీరంలో జరిగిన పరిశోధనలు భారతీయ చారిత్రక నిర్మాణంలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. పశ్చిమాన గోమతి నది అరేబియా సముద్రంలో కలిసే ప్రాంతంలో సాగర గర్భంలో ఒక మహానగరం బయటపడింది.. మహాభారత కాలాన్ని, శ్రీకృష్ణుడి ఉనికిని ఈ నగరం బయటి ప్రపంచానికి చాటి చెప్పింది.. ఇదే ఇవాళ మనం చెప్పుకుంటున్న ద్వారక.. .కృష్ణుడి ద్వారక.. విశ్వకర్మ నిర్మించిన ద్వారక..

ఈ తవ్వకాల్లో ఏవో చిన్న చిన్న రాళ్ల కట్టడాలు దొరికాయనుకుంటే పొరపాటే.. శిథిలాల రూపంలోనే అయినా, ఒక మహా నగరమే బయటపడింది.. సముద్రం అట్టడుగున ముందుకు వెళ్తున్న కొద్దీ వెళ్తున్నట్లే.. కిలోమీటర్ల కొద్దీ, అంతమెక్కడో తెలియనంత విస్తీర్ణంలో అపురూపమైన నిర్మాణం వెలుగు చూసింది..

మన దేశంలో ప్రసిద్ధి చెందిన ఆర్కియాలజిస్ట్‌ ఏస్‌.ఆర్‌. రావు నేతృత్వంలో సాగిన ఈ పరిశోధనలు ఈ మహానగరాన్ని దాదాపు క్రీస్తుపూర్వం 3150 సంవత్సరాల క్రితం నాటిదిగా నిర్ధారించారు.. మహాభారత కాలంలో కృష్ణుడు నిర్మించిన ద్వారకగా స్పష్టమైంది..
శ్రీకృష్ణుడు జన్మించిన సమయం క్రీస్తుపూర్వం3222 జూలై 27 శుక్రవారం అర్ధరాత్రి... మధురలో కంసుడి జైలులో జగద్గురువు జన్మించాడు.. కంసుడిని చంపిన తరువాత మధురను ఏలుతున్న కృష్ణుడిపై మగధ రాజు జరాసంధుడు, కాలయవనుడితో కలిసి 17 సార్లు యుద్ధం చేశాడు.. చివరకు ప్రజలకు రక్షణ కల్పించటం కోసం ఏకంగా పశ్చిమ తీరానికి వచ్చి గోమతి తీరంలో ద్వారకను కృష్ణుడు నిర్మించాడు..

శ్రీకృష్ణ నిర్యాణానంతరం సునామీ రూపంలో ప్రళయం వచ్చి ద్వారక సాగర గర్భంలో కలిసిపోయింది. కాలగర్భంలో ఆనవాలే లేకుండా పోయింది. మనకంటూ చరిత్రే లేదని అనిపించేలా అదృశ్యమైంది..

-------------------
ద్వారక సముద్రంలో మునిగిపోయిన తరువాత భారత్‌ నాగరికత కూడా మాయమైపోయింది.. మనం అన్నీ మర్చిపోయాం.. మన కల్చర్‌ గురించి మనకు అందించేవాళ్లే లేకుండా పోయారు. ఇప్పుడు అయిదు వేల ఏళ్ల తరువాత ఒక్కటొక్కటిగా బయటపడుతున్న మన మూలాల్ని చూస్తుంటే మనకే కాదు.. ప్రపంచ దేశాలన్నింటికీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.

సాగర గర్భంలో బయటపడిన ద్వారక నగరం ఆషామాషీ నగరం కానే కాదు.. ఇవాళ మనకు తెలిసిన గొప్ప గొప్ప నగరాలకంటే వెయ్యి రెట్లు అడ్వాన్స్‌డ్‌ మెట్రోపాలిటన్‌ సిటీ అని చెప్పవచ్చు. శ్రీకృష్ణుడు పర్‌ఫెక్ట్‌ ప్లాన్‌తో ద్వారక నిర్మాణానికి పూనుకున్నాడు.. విశ్వకర్మతో ఈ నగరాన్ని నిర్మించాడు.. గోమతి నది, సముద్రంలో కలిసే చోటును నగర నిర్మాణానికి ఎంచుకున్నాడు. అక్కడ సుమారు 36 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర నిర్మాణం జరిగింది.

ఈ నిర్మాణం కూడా అలాంటిలాంటి సెユ్టల్‌ కాదు. ద్వారకలో తొమ్మిది లక్షలు.. అవును.. అక్షరాలా తొమ్మిది లక్షల రాజభవనాలు ఉండేవి.. శ్రీకృష్ణుడి అష్ట భార్యలతో పాటు 16వేల మంది గోపికలకూ ఒక్కో రాజభవనం ఉండేదిట.. ఈ భవనాలన్నీ కూడా క్రిస్టల్స్‌, ఎమరాల్డ్‌, డైమండ్స్‌ వంటి అపురూప రత్నాలతో నిర్మించారు..ఒక్క మాటలో చెప్పాలంటే సిటీ ఆఫ్‌ గోల్డ్‌గా ద్వారకను చెప్పుకోవాలి..

పొడవైన అతి పెద్ద పెద్ద వీధులు.. వీధుల వెంట బారులు తీరిన చెట్లు.. మధ్యమధ్యలో ఉద్యానవనాలు.. వాటి మధ్యలో రాజభవనాలు.. ఏ వర్గానికి ఆ వర్గం ప్రత్యేకమైన నివాస గృహాలు.. వ్యవసాయ క్షేత్రాలు.. ఒక క్రమ పద్ధతి ప్రకారం ఒక నగరం ప్రజలందరికీ ఎలాంటి సౌకర్యాలు ఉండాలో.. అలాంటి సౌకర్యాలన్నింటితో నిర్మించిన ఏకైక నగరం ద్వారక..
నగర నిర్మాణం ఇళ్లు, వీధుల నిర్మాణంతోనే అయిపోయిందనుకుంటే పొరపాటే.. హైదరాబాద్‌ మహానగరంలో ఎక్కడ కమర్షియల్‌ జోన్లు ఉండాలో, ఎక్కడ రెసిడెన్షియల్‌ జోన్లు ఉండాలో ఇప్పుడు మాస్టర్‌ ప్లాన్లు వేస్తున్నారు.. ఇప్పటికే కట్టిన నిర్మాణాలను ఎలా తొలగించాలో తెలియక సిగపట్లు పడుతున్నారు.. కానీ, ద్వారకలో ఆనాడే ఇవన్నీ ఉన్నాయి.. కమర్షియల్‌ జోన్లు, ప్లాజాలు, అవసరమైన ప్రతిచోటా పబ్లిక్‌ యుటిలిటీస్‌, భారీ షాపింగ్‌ మాల్స్‌ అన్నీ ఉన్నాయి..

బ్యూటీకే.. బ్యూటీ... అందమైన గార్డెన్‌లు, పూల సువాసనలు, సరస్సులతో ద్వారక గోల్డెన్‌ సిటీ ఆఫ్‌ ఇండియాగా అలరారిందనటంలో సందేహం లేదు.

----------------------------
రామాయణ కాలంలో రావణుడి ఎయిర్‌పోర్ట్‌లను కనుగొన్నాం.. అతని ఆర్కిటెక్చర్‌ నైపుణ్యాన్ని తెలుసుకున్నాం.. భారత కాలంలో ద్వారక శ్రీకృష్ణుడి దార్శనికతకు దర్పణం పట్టింది.. భారత దేశంలో వేల ఏళ్ల నాడే అపూర్వ నాగరికత ఉన్నదన్న వాస్తవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది.. కాల గర్భంలో కలిపేందుకు చూసినా కలిసేది కాదని నిరూపించింది..

న్యూయార్క్‌ సిటీ, వాషింగ్టన్‌ డిసి, లండన్‌, మాస్కో, బీజింగ్‌, టోక్యో, ముంబయి.. ఇవన్నీ ఏమిటని అనుకుంటున్నారా? ఇవాళ ప్రపంచం గొప్పగా చెప్పుకునే, చాటుకునే మహానగరాలు.. మెట్రో పాలిటన్‌ సిటీలు.. కాస్మో పాలిటన్‌ సిటీలు.. ఏళ్ల తరబడి కష్టపడితే తప్ప ఇవాళ్టి రూపానికి రాలేని నగరాలు..

ఈ మెట్రో, కాస్మో పాలిటన్‌లకు వేల రెట్లు అడ్వాన్స్‌డ్‌ అభివృద్ధితో అపురూప నగర నిర్మాణం ఆనాడే జరిగింది. అదే ద్వారక.. ఇక్కడ కేవలం కమర్షియల్‌ జోన్లు ఏర్పాటు చేయటమే కాదు. సాగర తీరంలో గొప్ప హార్బర్‌ను కూడా యాదవ రాజులు సక్సెస్‌గా నిర్వహించారు. గ్రీకు, ఇతర దేశాలతో నౌకల ద్వారా అంతర్జాతీయ వర్తకం కూడా చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి.

ప్రముఖ ఆర్కియాలజిస్ట్‌ ఎస్‌ఆర్‌ రావు పరిశోధనల్లో ద్వారక ఆరు ప్రధాన రంగాల్లో ద్వారక అభివృద్ధిని సాధించిందని ధృవీకరించారు. ద్వారకను ద్వారామతి, ద్వారావతి, కుశస్థలి గా పిలిచేవారని కూడా తేల్చారు..
క్రీస్తుపూర్వం 3138లో మహాభారత యుద్ధం జరిగింది. యుద్ధం జరిగిన తరువాత 36 సంవత్సరాల పాటు శ్రీకృష్ణుడు ద్వారకలోనే ఉన్నాడు.. ఆ తరువాత యాదవ రాజుల మధ్య పరస్పరం గొడవలతో ఒకరికొకరు చంపుకున్నారు.. ఆ తరువాత కొంతకాలానికే శ్రీకృష్ణుడు దేహ పరిత్యాగం చేసి భూమిని విడిచివెళ్లిపోయాడు..ఈ భూమిపై కృష్ణుడు నివసించింది 120 సంవత్సరాలు. కృష్ణ నిర్యాణానంతరం ద్వారకను సముద్రం ముంచివేసింది. సాగరం ఉవ్వెత్తున ఎగిసి వస్తుంటే తాను ప్రత్యక్షంగా చూసినట్లు అర్జునుడు మహాభారతంలో చెప్తాడు..

సాగర గర్భంలో మునిగిపోయింది మునిగిపోగా.. తీరం వెంట కూడా ద్వారకకు సంబంధించిన, కృష్ణుడి రాజ్యానికి సంబంధించిన ఆనవాళ్లు లభించాయి. ప్రస్తుతం కనిపించే ద్వారకాధీశ్‌ ఆలయం కూడా కృష్ణుడి మనవడు వజ్రనాభుడే నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది...అసాధారణ భారతీయ ప్రతిభకు, నాగరికతకు, సంస్కృతికి ఎవరెస్ట్‌ శిఖరమంత కీర్తి

గ్రహాల ద్వారా కలిగే అనారోగ్యాల నివారణ ...



గ్రహాల దుష్టకిరణాల ద్వారా వ్యక్తిలో ఏర్పడే శారీరక, మానసిక రుగ్మతలకు గ్రహాల మంచి కిరణాల ద్వా రా వృద్ధి చెందిన వృక్ష జాతులు ఔషధాలవుతాయి అనేది జ్యోతిర్వైద్య సిద్ధాం తం. వ్యక్తి తగిన ఆహారాన్ని తీసుకోవాలి అని భగవద్గీత వచనం. ఆయుర్వేద సిద్ధాంతం జ్యోతిశ్శాస్త్ర సంప్రదాయం ఉపనిషోద్ఘోష. .ఈ తగిన అనే పదం చాలా విలువ కలిగి ఉంది. వేదాంతపరంగా మితమైన సాత్వికాహారం ఆయుర్వేదపరంగా వ్యక్తి శరీరానికి తగిన పౌష్టికాహారం అనే అర్థాలు చెప్పినా జ్యోతిర్వైద్యపరంగా వ్యక్తి దశకు గ్రహమిచ్చిన లోపాన్ని పూరించే ఆహారమని చెప్పాల్సి ఉంది. ఈ కోణంలో ఆలోచన చేసినప్పుడు జ్యోతిర్వైద్యం ఆయుర్వేదం కంటే భిన్నమైన సమగ్రతను, ప్రత్యేకతను నిలుపుకుంటోంది.

‘ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌’ అనే సంప్రదాయం ప్రసిద్ధమైనది. వాస్తు శాస్త్ర విద్య ఈశాన్యాన ఉన్న నుయ్యి, తూర్పున ఉన్న స్నానగృహం, ఇంట్లో ఈశాన్యాన ఉన్న పూజాగృహం, ఆగ్నేయాన ఉన్న వంటిల్లు బాలభానుని లేతకిరణాల వల్ల ఆరోగ్యాన్ని పెంచుతాయి. సౌర స్నానాల పేరిట ఆరోగ్యం సాధిస్తున్నారు. ఉదయకాంతి శరీర ఆరోగ్యానికి చాలా మంచిదని కొత్త వైద్య ప్రక్రియ కూడా రూపొందుతున్నది. ఉదయాన సంధ్యావందనం, సూర్య నమస్కారాలు, ఉదయకాలపు నడక ఆరోగ్యవంతుల మంచి అలవాట్లు. సూర్యుని కాంతిని ప్రత్యేక అద్దం ద్వారా అనారోగ్య ప్రదేశంలో ప్రసరింపజేసి ఆనారోగ్యాన్ని నివారించే పద్ధతిని రష్యన్‌ శాస్తవ్రేత్తలు నిరూపించారు. వేర్వేరు రోగాలకు వేర్వేరు రంగుటద్దాల ద్వా రా సూర్యకాంతిని ప్రసరింపజేసి అనారోగ్యాలను నివారింపచేసే కలర్‌ థెరపీ ప్రసిద్ధి చెందుతోంది. రవికి సంబంధించిన ధాన్యం, గో ధుమలు, గోధుమ పాలు, గోధుమ గడ్డి రసం పలువిధాలైన అనారోగ్యాలను నివారిస్తున్నట్టుగా శాస్తవ్రేత్తలు వక్కాణించారు. జ్యో తిశ్వాస్త్ర రీత్యా పగడం రవికి చెందిన అల్పమూల్య రత్నం. ఇలా రవి లక్షణాలు గల పదార్ధా లు రవి ప్రభావం వలన జనించిన రోగాలన్నీ నయం చేస్తున్నాయి.

కాల్షియంకు ము త్యపు చిప్పలకు, ముత్యాలకు, మంచి గంధానికి, లవణానికి అధిపతి చంద్రుడు. మనస్సు కు చంద్రుడు అది దేవత. రక్తంలోని తెల్ల రక్తకణాలకు చంద్రుడే అధిపతి. శరీరంలోని కాల్షి యం లోపించినపుడు ముత్యపు భస్మం ముందుగా తీసుకోవాలంటుంది ఆయుర్వేదం. పూర్వపు రాజులు ముత్యపు సున్నం తాంబూలంలో వాడుకున్నారు. శరీరంలోని రక్తవేగం పెంచడానికి లవణం ఉపయోగపడుతుంది. ప్రేమ, కోపం, ఉద్వేగం బొమ్మా బొరుసులు. ఆ ఉద్వేగాన్ని పెంచే లక్షణం లవణంలో ఉం ది. ఆ ప్రేమకు కూడా చంద్రుడే అధిపతి. అదే లవణాన్ని సూక్ష్మీకరించి (నేట్రంమూర్‌) ముం దుగా వాడితే ఉద్వేగాన్ని రక్తపోటును తగ్గిస్తోం ది. మంచి గంథం రాసుకుంటే చల్లదనం ఇ స్తుంది. వెన్నెల ఆ లక్షణం కలదే. ముత్యం ధరిస్తే మనసు ప్రశాంతిని పొందుతుందని జ్యోతిశ్వాస్త్ర సాంప్రదాయం.

ఎర్ర రక్త కణాలకు, రక్త చందనానికి, ఎముకలలోని మజ్జ కు, తుప్పుగల ఇనుముకు, వ్రణాలకు, దెబ్బ సెప్టిక్‌ అవ్వడానికి, బెల్లంలోని ఐరన్‌కు అధిపతి కుజుడే.కుజగోళం ఆకాశంలో ఎర్రగా కనుపిస్తుంది. ఆ ఎరుపుకు కారణం ఆ గోళం మీద తుపపుపై సూర్యకాంతి పడటమే. శరీరంలో ఐరన్‌ అధికంగా ఉంటే దెబ్బలు తొందరగా తగ్గుతాయి. అవి లోపించిన దెబ్బపై తుప్పు ఇనుము తగిలినా సెప్టిక్‌ అవుతుంది. బెల్లాన్ని శరీరంలో ఇముడ్చుకునే శక్తి లోపించినపపుడు ఆ బెల్లమే వ్రణాలను తగ్గకుండా చేస్తుం ది. ఎములలో ని మజ్జలో పగ డం కలిసిపోతుందని ఫ్రాన్స్‌ వైజ్ఞానికుల అభిప్రాయం. పగడం కుజగ్రహానికి చెందిన రత్నం. కుజుడు శరీర పుష్టికి ప్రాధాన్యం ఇచ్చే గ్రహం. అతనికి ధాన్యమైన కందిపప్పు శరీర పుష్టినిస్తోంది. కందుల రంగు ఎరుపే.ఆ ఎముకలలోని లోపాలను పగడం ద్వారా పూరించడం ఫ్రాన్స్‌ శాస్తజ్ఞ్రుల కృషి ఫలితం.

బుధుడు నరాలకు సంబం ధించిన గ్రహం. అతని రాశులు మిథున, కన్యలు. ధాన్యం పెస లు. కన్యారాశి ఉత్పత్తికి, అమ్మకానికి సంకేతం. బుధుడు వ్యాపారస్థుడు. అతని రంగు ఆకుపచ్చ. ఆ రంగు ఉత్పత్తికి సంకేతమని ఆధునిక వైజ్ఞానికుల అభిప్రా యం. పెసల రంగూ ఆకుపచ్చేనని, అవి నరాల నిస్సత్తువను తొలగిస్తాయని ఆహార వైద్యుల అభిభాషణం. బుధుడు సమయస్ఫూర్తికి అధిపతి. అది లోపించడం బుద్ధి మాంద్యం. పెసలలోనూ బుధునికి చెందిన వసలోను ఆ బుద్ధి మాంద్యాన్ని తగ్గించే లక్షణం ఉంది.

గురుడు పసుపుకు, పంచదారకు, షుగర్‌ వ్యాధికి, శనగలకు సంబంధించిన గ్రహం. పంచదారను జీర్ణించుకుంటే షుగర్‌ వ్యాధి రాదు. అది జీర్ణించుకోలేనప్పుడు ఏర్ప డే పుళ్ళకు వేప, పసుపు మందులైతే పంచదార, శనగలు పుళ్ళు తగ్గకుండా చేస్తాయి. గురుడు మేధావి. మేధావులు ఆలోచనలు చేస్తారు. వ్యాయామం చేయరు. ఆ రెండు లక్షణాలే షుగర్‌ వ్యాధిని పుట్టిస్తాయి. పసుపు షుగర్‌ వ్యాధి తగ్గిస్తుందని, వ్యాయామం షుగర్‌ రాకుండా చేస్తుందని వైద్యుల అభిప్రాయం. విశేషించి గురునికి చంద్ర, కుజ, శనులను దోషరహితులుగా చేసే ప్రత్యేక లక్షణం ఉంది.చంద్రుడిచ్చే జబ్బులకు శనిచ్చే వాతానికి పసుపు మంచి మందు. టి.బి.కి కూడా చం ద్రుడే అధిపతి. దాన్ని నివారించే శక్తి వెన్న కలిపిన పసుపుకున్నది.

శుక్రుడు సౌందర్యానికీ, నిమ్మపండుకు, తేనెకు, చింతపండుకు, చర్మానికి అధిపతి. సౌందర్యాన్ని చింతపండు, నిమ్మపండు పెంపొందించడం లోకప్రసిద్ధమే. తేనె కూడా ఈ విషయంలో సహకరిస్తుంది. అది పుష్పాల నుండే వస్తుంది. పుష్ప జాతులు సౌందర్యానికి, సౌకుమార్యానికీ ప్రతీకలు.

శని- వాత లక్షణం కలవాడు.చర్మం లోని మాలిన్యాలను వెలువరించే శక్తికి ఇతడు అధిపతి. నువ్వులకు, ఊపిరితిత్తులకు కూడా అధిపతే. ఊపిరితిత్తులు చేసే పని వాయువును క్రమబద్ధం చేయడమే. వాతం అంటే వాయు దోషమే కదా! మాలిన్యాలను వెలువరించే లక్షణం, ఊపిరితిత్తుల పనిని క్రమబద్ధం చేసే లక్షణం నువ్వులకు ఉందని ఆయుర్వేద విజ్ఞానం చెపుతోంది. నువ్వుల నూనె శరీరానికి పట్టించి అభ్యంగనం చేస్తే రోమకూపాలు శక్తివంతమై చర్మంలోని మాలిన్యాలను తొలగిస్తాయి.

ఇలా గ్రహాలకు చెందిన లేదా పొంత ఉన్న వస్తువులు గ్రహాల వల్ల కలిగే అనారోగ్యాలను తొలగిస్తున్నాయి. విశేషించి ఆయా గ్రహాలు ఉచ్ఛ స్వక్షేత్రాదులలో బలంగా ఉన్నప్పుడు ఆయా పంటలు ఎ క్కువగా పండి దేశ ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నాయి. . సప్త గ్ర హాల సామ్రాజ్యాన్ని అర్థం చేసుకుంటే ఆనం ద సామ్రాజ్యాన్ని, ఆరోగ్య సా మ్రాజ్యాన్ని మ నమేలుకోవచ్చు. మనవారి మేలు కోరవచ్చు.

పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు

నేడు అమలులోలేని మనకు తెలియని మన పూర్వీకులు మనకందించిన అపూర్వగ్రంథ శాస్త్ర రాజములు:
నేటి భారతీయులకు ఎంతమందికి తెలుసు మన పూర్వీకుల ఈ విజ్ఞాన సంపద?

క్రింది మన పురాతన భారతీయులు వ్రాసిన శాస్త్రాలు చూస్తుంటే నేడు మనకు ఇవి ఎలా అందకుండాపోయాయా? అని ఆశ్చర్యం కలుగక మానదు.

1.అక్షరలక్ష:ఈ గ్రంథం ఒక ఎన్సైక్లోపీడియా గ్రంథము.రచయిత వాల్మీకి మహర్షి.రేఖాగణితం,బీజగణితం,త్రికోణమితి,భౌతిక గణితశాస్త్రం మొదలైన 325 రకాల గణితప్రక్రియలు, ఖనిజశాస్త్రం,భూగర్భశాస్త్రం,జలయంత్ర శాస్త్రం,గాలి,విద్యుత్,ఉష్ణం లను కొలిచే పద్దతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెల్పబడ్డాయి.

2.శబ్దశాస్త్రం:రచయిత ఖండిక ఋషి.సృష్టిలోని అన్ని రకాల ధ్వనులను,ప్రతిధ్వనులను ఇది చర్చించింది. ఉన్నాయి.307 రకాల శిల్పాల గురించి

Friday 21 February 2014

అల్లూరి విల్లుకి తెల్లోది విల విల.... గిరిజన సింహం అల్లూరి సీతారామరాజు


అల్లూరి విల్లుకి తెల్లోది విల విల.... గిరిజన సింహం అల్లూరి సీతారామరాజు పేరుకి తగ్గట్టుగానే అయన ఒక రామ రాజు, అప్పటిగిరిజనుల ను చైతన్యవంతుల్ని చేసిన గొప్ప వీరుడు మన అల్లూరి... ఈ సింహాన్ని పట్టడం చేతకాని బ్రిటీష్ మూకలు వెన్నుపోటు పొడిచి హత్య చేసారు... కాని రామరాజు మరణం వీర మరణం...
 ఇరవై ఏడేళ్ళంటే ముక్కుపచ్చలారని వయసు. చదువు పూర్తిచేసుకొని, అప్పుడప్పుడే వ్యాపారమో, ఉద్యోగమో మరేదైనా సంపాదనామార్గమో ఎంచుకొని విజయాల బాటన నడక మొదలుపెట్టే వయసు. అల్లూరి సీతారామరాజు ఆ సరికే ఒక మహాసామ్రాజ్యాన్ని గడగడలాడించగల ఉద్యమాన్ని నడిపి, దేశవ్యాప్తంగా ఒక స్వాతంత్ర్య స్పూర్తిని నింపి, నిష్క్రమించాడు.

ఈ నేల మనదిరా, ఈ గాలి మనదిరా అని స్వేశ్చగా అటవీసంపదను వాడుకొంటూ, చెట్లునరికి పోడువ్యవసాయం చేసుకొంటూ, వనసంపదని సంతల్లో బియ్యానికీ, వంటసరుకులకీ వస్తుమార్పిడి చేసుకొంటూ, పండుగలకీ పబ్బాలకీ ఇంకోలా చెప్పుకొంటే అసలు ఏ ప్రత్యేక సందర్భం లేకపోయినా ఈతకల్లునీ, తాటికల్లునీ సేవిస్తూ ఆనందంగా గడిపేస్తున్న మన్యం జనాలు బ్రిటీషువాళ్ళ అటవీ రిజర్వు చట్టాలు, అబ్కారీ చట్టాల వల్ల చాలా ఇబ్బంది పడ్డారు. చేతులూ కాళ్ళూ కట్టేసినట్టయ్యాయి. అప్పుడు సీతారామరాజు వాళ్ళ జీవితాల్లో వెలుగునింపే మెరుపులా, తెల్లవాళ్ళ పాలిట పిడుగులా వచ్చాడు.

1907లో, అంటే అప్పటికి సీతారామరాజుకి పదేళ్ళు ఉంటాయేమో - బిపిన్ చంద్రపాల్ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాడు. ఎందరో వాటికి ఉత్తేజితులయ్యారు. వారిలో మనహీరో ఒకడు. తరువాత ఒక పుష్కరకాలానికి గాంధీజీ సహాయనిరాకరణోధ్యమం వల్ల కొత్త ఆలోచనలకి త్వరగా స్పందించే వయసులో ఉన్న యువకుడు సీతారామరాజు తెల్లవాళ్ళను ఎదిరించాలని నిర్ణయించుకొన్నాడు. గాంధీజీలా అహింసామార్గంలో కాదు. హింసామార్గంలో.

మన్యప్రాంతానికివెళ్ళి అక్కడివాళ్ళకి స్వాతత్ర్యంయొక్క ప్రాముఖ్యతని నూరిపోసి, దళాన్ని కూడగట్టుకొన్నాడు. కాకపోతే పాతకాలపు విల్లంబులులాంటి ఆయుదాలు తెల్లవాళ్ళ తుపాకీ గుళ్ళముందు దిగదుడుపే! కాబట్టి, పోలీస్ స్టేషన్ల మీద దాడి చేసి అక్కడ ఉన్న తుపాకీలనీ, మందుగుండు సామాగ్రినీ స్వాధీనం చేసుకోవడానికి చింతపల్లి, కృష్ణదేవిపేట, రాజవొమ్మంగి మొదలైన పోలీస్‌స్టేషన్ల మీద మెరుపుదాడి చేసి సఫలమయ్యాడు. ప్రభుత్వానికి వెన్నులో ఒణుకుపుట్టించాడు. ఈ చిచ్చరపిడుగుని ఎదుర్కోవడానికి ఆధునిక పరికరాలనీ, ఆయుదాలనీ, ప్రక్కరాష్ట్రాలనుంచి ప్రత్యేక పోలీసు బలగాలనీ రప్పించ వలసి వచ్చింది.

 
1922 నుంచి 1924 వరకూ కేవలం రెండు సంవత్సరాలే అయినా, ఎవరికీ కంటిమీద కునుకు లేకుండా చేశాడు.

రాజుని నమ్ముకొన్న మన్యంప్రజలకి వేదింపులు మొదలయ్యాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా అల్లూరి సీతారామరాజు లొంగేవాడుకాదు. కానీ, ఆశ్రితజన పీడన ఆతనికి వేదన అయ్యింది. అందుకే, తనకు తానుగా లొంగిపోయాడు. ఈ నిప్పుని వొడిలో పెట్టుకొంటే సామ్రాజ్యాన్నే కాల్చి మసిచేస్తుందని భావించారేమో! లొంగిపోయిన వీరుడ్ని అదుపులోకి తీసుకోకుండా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపారు.

కానీ ఆ విప్లవజ్యోతి ఇంకా స్పూర్తిని నింపుతూనే ఉంది

Thursday 20 February 2014

మన తెలంగాణా రాష్ట్రం వచ్చింది.. మన అభివృది కి మనం చేయవలిసిన మొదటి పని...........


దేశ భాషాలందు తెలుగు లెస్స .......




ఈ విషయం మీకు తెలుసా ?


దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక , ప్రధానమంత్రి నెహ్రూ గారి అధ్యక్షతన దేశ భద్రత విషయం లో వొక ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది .. భారత సేనాధ్యక్షుడి ఎంపిక విషయమై తీవ్ర మైన చర్చ జరుగుతోంది . కొందరు మంత్రులు ,కాంగ్రెస్ నేతలు, సైనికాధికారుల తో నెహ్రూ గారు భారతీయ సేన బాధ్యతలు ఎవరికీ అప్పగించాలనే విషయమై సమాలోచనలు జరుపుతున్నారు . సమావేశం మధ్యలో నెహ్రూ గారు జోక్యం చేసుకుంటూ వో ప్రతిపాదన చేశారిలా - " వొక బ్రిటిష్ అధికారినే మన భారతీయ సేనకు ఆర్మీ జనరల్ గా నియమిస్తే బావుంటుందేమో ! ఎందుకంటే మన వద్ద సైన్యాన్ని లీడ్ చేసే అనుభవశాలి ఎవరూ కనపడటం లేదు ... ఏమంటారు ?"అని . సమావేశం లో పాల్గొన్న మంత్రులూ , కాంగ్రెస్ నేతలు నెహ్రూ గారి ప్రతిపాదన ను సమర్థించటం మొదలెట్టారు , ఎంచేతంటే ఆయన ప్రధానమంత్రి హోదా లో వున్న ప్రముఖుడాయే ..
ఐతే ఇదే సమయాన సైనికాధికారుల వరుస లో నుండి "ప్రధాన మంత్రి గారూ నాదో సూచన ... నా దేశ ఆత్మగౌరవానికి సంబంధించినది ఈ సూచన " అనే మాటలు వినబడ్డాయి . దాంతో నెహ్రూ సహా సమావేశం లో పాల్గొన్న వారంతా అటు వేపు తలలు తిప్పారు , కొద్ది క్షణాల సేపు ఆ సమావేశం లో మౌనం ... !!
ఆ తర్వాత ప్రధానమంత్రి " చెప్పండి మిత్రమా , నిర్మొహమాటం గా- నిర్భయం గా చెప్పండి మీ సూచన ఏంటో ?" అన్నారు . ఆ సైనికాధికారి మెల్లగా -దృఢమైన గొంతుక తో చెప్పడం
మొదలెట్టారిలా " సర్ , మన దేశం సర్వ స్వతంత్రమైన దేశం , దేశ సార్వభౌమత్వానికి ప్రతీక గా నిలిచే ఏ ముఖ్యమైన పదవి లో నయినా మన భారతీయులే వుండా లనేది నా కచ్చితమైన అభిప్రాయం . అనుభవం లేదని చెప్పేసి ప్రధానమంత్రి పదవి లో కూడా వొక బ్రిటిష్ వాడిని కూర్చోబెడదామా ? చెప్పండి ". నెహ్రూ గారు ఖంగు తిన్నారు , ఆనక ఆయన్నే అడిగారు -"మీరు చెప్పింది నిజమే , అంగీకరిస్తాను .. మరి సైన్యాధ్యక్షుడి బాధ్యతలు చేపట్టేందుకు మన వద్ద యోగ్యులెవరున్నారు ?". దాంతో ఆ అధికారి జవాబిస్తూ అన్నారిలా - "ప్రధానమంత్రి గారూ - యోగ్యులు ,నిజాయితీపరులు మరియు గుణ సంపన్నులైన వారెందరో మన వద్ద వున్నారు , అంతెందుకు -నా సీనియర్ అధికారి లెఫ్టినెంట్ జనరల్ కరియప్ప... ఇక్కడే -మన మధ్యనే వున్నారు , సేనాధ్యక్షుడిగా , సైన్యాధిపతి గా ఆయన అన్ని విధాలా యోగ్యుడైన వ్యక్తి . ". ఆ అధికారి సూచన ను నెహ్రూ గారు వెంటనే ఆమోదించేశారు .
ఇంతకూ నెహ్రూ నే ఖంగు తినిపించి దేశ ఆత్మ గౌరవాన్ని ప్రబోధించిన ఆ సైనికాధికారి ఎవరో తెలుసా ? భారతీయ ఆర్మీ కి మొదటి లెఫ్టినెంట్ జనరల్ గా వ్యవహరించిన లెఫ్టినెంట్ జనరల్ నథూ సింగ్ రాథోడ్ .

జయ జయ హో తెలంగాణా...


నియోజకవర్గాల సమాచారం

కూకట్‌పల్లి

నియోజకవర్గం: కూకట్‌పల్లి
ఆవిర్భావం : 2009
ఎమ్మెల్యే : జయప్రకాష్‌ నారాయణ (లోక్‌సత్తా) చారిత్రాత్మక నేపథ్యం

కూకట్‌పల్లిలో నిజాంకాలం నాటి బురుజులు, కమాన్లు ఇప్పటికీ దర్శనమిస్తాయి. ఒకప్పుడు కేపీహెచ్‌బీకాలనీలోకి రావాలంటే ప్రజలు భయపడేవారు. దోపిడీలు.. హత్యలు జరగడమే దీనికి కారణం. ఇటువంటి కాలనీ తర్వాత గణనీయమైన అభివృద్ధి చెంది ఆసియాలోనే అతిపెద్ద కాలనీగా ఆవిర్భవించింది. అతిపెద్ద హౌసింగ్‌ ప్రాజెక్టులు మలేషియా టౌన్‌షిప్‌, ఇందూ ప్రాజెక్ట్సు తదితరాలు ఈ కాలనీకి మణిపూసల్లాంటివి. ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ జేఎన్‌టీయూ ఇక్కడే కొలువై ఉంది.

రాజకీయ నేపథ్యం
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గమైన ఖైరతాబాద్‌లో అంతర్భాగంగా ఉన్న కూకట్‌పల్లి ప్రాంతం... పునర్విభజనలో 2009లో అసెంబ్లీ నియోజకర్గంగా ఆవిర్భవించింది. ఇక్కడ నుంచి లోక్‌సత్తా అధినేత జయప్రకాష్‌నారాయణ గెలుపొందారు. ఈ ఎన్నికల్లో తెదేపా పోటీలో లేకపోవడం లోక్‌సత్తాకు లాభించింది. కూకట్‌పల్లి తెదేపాకు కంచుకోటగా చెప్పుకోవచ్చు. గ్రేటర్‌ ఎన్నికల్లో నియోజకవర్గంలోని 6 డివిజన్లలో నాలుగింటిని తెదేపా, ఒకటి ప్రరాపా, ఒకటి కాంగ్రెస్‌ దక్కించుకున్నాయి. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలూ ఇక్కడ నివాసముంటున్నారు.
భౌగోళిక పరిస్థితులు
కూకట్‌పల్లిలో అంతర్భాగమైన ముఖ్య ప్రాంతాలు శేరిలింగంపల్లిలో కలిశాయి. సికింద్రాబాద్‌, కంటోన్మెంట్‌కు అనుబంధంగా ఉంటే పాత బోయిన్‌పల్లి, హస్మత్‌పేట ప్రాంతాలతో పాటు బేగంపేటలోని కొంత భాగాన్ని ఈ నియోజకవర్గంలో కలిపారు.
రహదారులు
ముంబయి జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌9) కూకట్‌పల్లి నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాల మీదుగా వెళుతుంది. బాలానగర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ తదితర ప్రాంతాల్లో ఆర్‌ అండ్‌ బి రహదారులు ఉన్నాయి. అధికశాతం రహదారులన్నీ కూకట్‌పల్లి సర్కిల్‌ నిర్వహణలో ఉన్నాయి.

మేడ్చల్‌ నియోజకవర్గం


ఎమ్మెల్యే : కె.లక్ష్మారెడ్డి
ఓటర్ల సంఖ్య : 3,21,860
పురుష ఓటర్లు : 1,66,608
మహిళా ఓటర్లు : 1,55,252

మండలాలు:  
మేడ్చల్‌ నియోజకవర్గం మేడ్చల్‌, శామీర్‌పేట, ఘట్కేసర్‌, కీసర మండలాల పరిధితో ఏర్పాటయింది. మేడ్చల్‌ నియోజకవర్గంలోని కీసర మండలంలో శ్రీ రామలింగేశ్వరస్వామిఆలయం(కీసరగుట్ట) పర్యాటక ప్రాధాన్యం కల్గిన దేవాలయం.
సహజవనరులు: 
మేడ్చల్‌ నియోజకవర్గంలోని ఘట్కేసర్‌, మేడ్చల్‌, శామీర్‌పేట, కీసర మండలాల్లో బిల్డింగ్‌ స్టోన్‌, కంకర రాయి, ఇసుక, ఇటుకమట్టి, ఆర్డినరీ క్లే తదితర సహజవనరులు లభిస్తున్నాయి.
రైల్వే స్టేషన్లు: 
మేడ్చల్‌ నియోజకవర్గం పరిధిలో మేడ్చల్‌, గౌడవెల్లి, గుండ్లపోచంపల్లి, డబ్లిపూర్‌, చర్లపల్లి, ఘట్కేసర్‌లలో రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

మల్కాజిగిరి

నియోజకవర్గ ఆవిర్భావం: 2009
ప్రస్తుత శాసనసభ్యుడు : ఆకుల రాజేందర్‌(కాంగ్రెస్‌)
పార్లమెంట్‌ నియోజకవర్గ ఆవిర్భావం: 2009
అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ల వివరాలు: మొత్తం ఓటర్లు: 3,36,883 (పురుషులు : 1,71,367, మహిళలు : 1,62,121)
నియోజకవర్గ విస్తీర్ణం : 15,400 కిలోమీటర్లు

నియోజకవర్గపరిధిలోని మండలాలు: ఒక్కటి (మల్కాజిగిరి)
సర్కిళ్లు : మల్కాజిగిరి, అల్వాల్‌
నేపథ్యం: మల్కాజిగిరి నియోజకవర్గం ఏర్పడక ముందు ఈ ప్రాంతం సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ప్రాంతంలో ఉండేది. పూర్వకాలంలో ఇక్కడ మల్లికార్జునస్వామి దేవాలయం ఉండేది. దాంతో ఈ ప్రాంతాన్ని మల్లికార్జున గిరిగా పిలిచేవారు. కాలక్రమంలో మల్కాజిగిరిగా మారిపోయింది. రంగారెడ్డి జిల్లాలో గ్రామంగా ఉండేది. కాలక్రమంలో నగరీకరణ వల్ల ఈ ప్రాంతం 1981లో మున్సిపాలిటీగా అవతరించింది. నాలుగేళ్ల క్రితం గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌లో విలీనమయింది. మల్కాజిగిరిలో రామకృష్ణాపురం, సఫిల్‌గూడ చెరువు, బండ్లచెరువు, అల్వాల్‌లో చెరువులు లు ప్రసిద్ధిచెందాయి. సఫిల్‌గూడ చెరువు ప్రస్తుతం పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. కేంద్ర రక్షణ శాఖకు చెందిన 'ఏఓసీ' సెంటర్‌ సగం ఈ నియోజకవర్గంలోనే ఉంది. ఇక్కడ సైనిక శిక్షణ, యుద్ధంలో ఆయుధాల వాడకంపై శిక్షణ ఇస్తారు.


కుత్బుల్లాపూర్‌

నియోజకవర్గ ఆవిర్భావం: 2009
అంతకముందు: మేడ్చల్‌ నియోజకవర్గంలో అంతర్భాగం
ఎమ్మెల్యే: కూన శ్రీశైలంగౌడ్‌(కాంగ్రెస్‌)
మండలాలు: కుత్బుల్లాపూర్‌

చారిత్రక నేపథ్యం: నైజాం ప్రభుత్వం 1897లో జీడిమెట్లలో ఫాక్స్‌సాగర్‌ నిర్మించింది. ఆసియా ఖండంలోకెల్లా అతి పెద్ద పారిశ్రామిక వాడ జీడిమెట్లలో ఆవిర్భవించింది. దుండిగల్‌లో ఎయిర్‌ఫోర్స్‌ అకాడమినీ ఏర్పాటు చేశారు. గతంలో ఈ ప్రాంతం మేడ్చల్‌ అసెంబ్లీ, సిద్ధిపేట పార్లమెంటు నియోజకవర్గాల్లో అంతర్భాగం. పునర్విభజనలో తాజాగా ప్రత్యేక అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడింది. ఇది మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది.
రాజకీయ నేపథ్యం: ఆది నుంచి కాంగ్రెస్‌ పార్టీకి ఇక్కడ పట్టుంది. తెదేపా ఆవిర్భవించాక క్రమంగా ఆ పార్టీ అటు మండలంలో, ఇటు మున్సిపాలిటీలో పాగా వేస్తూ వచ్చింది. నియోజకవర్గం ఏర్పాటయ్యాక 2009లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తిరుగుబాటు అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌ తెదేపా ఆధిపత్యానికి అడ్డుకట్టవేశారు.
భౌగోళిక పరిస్థితులు: 1500 ఎకరాల విస్తీర్ణంలో రిజర్వ్‌డ్‌ ఫారెస్టు, 200 ఎకరాల్లో క్వారీ పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. ఉత్తరం దిక్కున దుండిగల్‌ ఏయిర్‌ఫోర్స్‌ అకాడమీ, దుండిగల్‌, బౌరంపేట, మల్లంపేట, బాచుపల్లి గ్రామాల సరిహద్దులో మెదక్‌ జిల్లాలోని అన్నారం, జిన్నారం, ఖాజిపల్లి, ఐడీఎ బొల్లారం ఉండగా, తూర్పున మేడ్చల్‌, అల్వాల్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లోని, కాలనీలు, దక్షిణానా బాలానగర్‌ ప్రాంతంలోని కాలనీలు, పశ్చిమాన శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కాలనీలు విస్తరించి ఉన్నాయి.

రహదారులు:  
7వ నెంబరు జాతీయ రహదారి సుచిత్రా చౌరస్తా నుంచి కొంపల్లి వరకు మూడు కిలోమీర్ల మేర విస్తరించి ఉంది. 25 కిలోమీటర్ల మేర నర్సాపూర్‌ అర్‌అండ్‌బీ రాష్ట్ర రహదారి ఉంది.

ఉప్పల్‌

ఉప్పల్‌ నియోజకవర్గం పరిధిలో ఉప్పల్‌ మండలం ఉంది. ఇక్కడ 3,71,279 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,97,786 మంది పురుషులు కాగా 1,73,493 మంది స్త్రీలు.

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం

ఎమ్మెల్యే: మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
ఓటర్ల సంఖ్య : 2,05,596
పురుష ఓటర్లు : 1,06,393
మహిళా ఓటర్లు : 99,203

ప్రత్యేకత: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌ సిటీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని హయత్‌నగర్‌ మండలంలో ఉంది. యాచారం మండలంలోని నందివనపర్తిలో చారిత్రక ప్రాధాన్యమున్న నంది ఉంది.
మండలాలు: ఇబ్రహీంపట్నం నియోజకవర్గం హయత్‌నగర్‌, మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం మండలాలతో ఏర్పాటయింది.
సహజవనరులు: ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, హయత్‌నగర్‌ మండలాల్లో బిల్డింగ్‌ స్టోన్‌, కంకరరాయి, ఇటుక మట్టి, ఇసుక పుష్కలంగా లభిస్తున్నాయి.
ఈ నియోజకవర్గ పరిధిలో రైల్వే స్టేషన్లు లేవు.


ఎల్బీనగర్‌



ఆవిర్భావం: 2009
ఎమ్మెల్యే: దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి(కాంగ్రెస్‌)
జనాభా: 8 లక్షలు
ఓటర్లు: 4,12,724. (పురుషులు 2,17,954, స్త్రీలు 1,94,770)
పోలింగ్‌ బూత్‌లు: 345

డివిజన్లు: 8. (కొత్తపేట, మన్సూరాబాద్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, కర్మన్‌ఘాట్‌, చంపాపేట, గడ్డిఅన్నారం, పీఅండ్‌టీకాలనీ).
మండలాలు: సరూర్‌నగర్‌, ఉప్పల్‌. (గ్రామాలు- కొత్తపేట, బండ్లగూడ, నాగోలు, మన్సూరాబాద్‌, హయత్‌నగర్‌, సాహెబ్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌, బైరామల్‌గూడ, చంపాపేట, గడ్డిఅన్నారం).
నియోజకవర్గ విస్తీర్ణం: 86 చ.కి.మీ.
మున్సిపాలిటీ: ఎల్‌.బి.నగర్‌, గడ్డిఅన్నారం మున్సిపాలిటీలుగా ఉండేవి. రెండున్నరేళ్ల క్రితం గ్రేటర్‌లో విలీనమయ్యాయి. ఎల్‌.బి.నగర్‌ సర్కిల్‌గా కొనసాగుతోంది.)
ప్రాధాన్యాలు: రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న నియోజకవర్గం.
నియోజకవర్గంలో సచివాలయంలో పని చేసే ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు. అసియాలోనే అతిపెద్ద కాలనీ వనస్థలిపురం ఇక్కడే ఉంది.
పరిశోధన సంస్థలు: దక్షిణ భారతదేశంలోని ఖనిజ వనరులు, భూగర్భవనరులు, మ్యాపింగ్‌, గనుల గుర్తింపు, శిలాజాలు, పురాతన అంశాలపై విశేషంగా కృషి చేసే జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సంస్థ బండ్లగూడలో సువిశాల విస్తీర్ణంలో ఉంది. సుమారు 200 ఎకరాల స్థలంలో జీఎస్‌ఐ ఆవరించి ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంగా పని చేస్తోంది. పరిశోధనలు, శిక్షణలు, జలవనరులను కూడా గుర్తించే పనులు నిర్వహిస్తోంది. సుమారు 2 వేల మంది శాస్త్రవేత్తలు, ఇతర అధికారులు, సిబ్బంది దీంట్లో పని చేస్తున్నారు.
నగరానికి తలమానికమైన సరూర్‌నగర్‌ ఇండోర్‌స్టేడియం ఉంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలకు వేదిక. జిమ్నాస్టిక్స్‌, రన్నింగ్‌, హాకీ, షటిల్‌, చదరంగం వంటి అనేక ఆటల్లో ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. శాప్‌ ఆధ్వర్యంలో స్టేడియం నడుస్తోంది.
గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్‌కు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచివివిధ రకాల పండ్లు దిగుమతి అవుతాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్‌ ఇది.
మన్సూరాబాద్‌ సహారా ఎస్టేట్స్‌లో దాదాపు 10 రాష్ట్రాలకు చెందిన ప్రజలు కలిసి నివసిస్తున్నారు. భిన్న సంస్కృతులకు వేదికగా నిలుస్తోంది.
చారిత్రక నేపథ్యం: కొత్తపేట, నాగోలు, బండ్లగూడ, మన్సూరాబాద్‌, హయత్‌నగర్‌, సాహెబ్‌నగర్‌, కర్మన్‌ఘాట్‌, చంపాపేట, బహదూర్‌గూడ, గడ్డిఅన్నారం, సరూర్‌నగర్‌ పంచాయతీలతో మొదట మున్సిపాలిటీ ఏర్పడింది. ఆ తర్వాత నియోజకవర్గ పునర్విభజనతో సరూర్‌నగర్‌ మినహా మిగతా గ్రామ పంచాయతీ పరిధి కలిసి నియోజకవర్గంగా మారింది. బహదూర్‌గూడ చౌరస్తాకే లాల్‌బహదూర్‌ చౌరస్తాగా నామకరణం చేశారు. తరవాత అక్కడ కొత్తగా ఏర్పడిన కాలనీకి లాల్‌బహదూర్‌నగర్‌ (ఎల్‌.బి.నగర్‌)గా పేరొచ్చింది. అదే పేరు మొదట మున్సిపాలిటీకి, ఆ తర్వాత నియోజకవర్గానికి వచ్చింది.
రాజకీయ నేపథ్యం: మలక్‌పేట నియోజకవర్గంగా ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి మల్‌రెడ్డి రంగారెడ్డి చక్రం తిప్పేవారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన నేపథ్యంలో ఎల్‌.బి.నగర్‌ ఏర్పడింది. ఎన్నికల్లో మల్‌రెడ్డికి టిక్కెట్టు రాకపోవడంతో డి.సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. గ్రేటర్‌ ఎన్నికల్లో 8 డివిజన్లలో ఏడు తెదేపా గెలుచుకుంది. గడ్డిఅన్నారంలో మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ గెలిచింది. కార్పొరేటర్లు కొత్తపేట-వజీర్‌ ప్రకాష్‌గౌడ్‌, మన్సూరాబాద్‌-కొప్పుల లత, హయత్‌నగర్‌-సామ రంగారెడ్డి, వనస్థలిపురం-జిట్టా రాజశేఖర్‌రెడ్డి, కర్మన్‌ఘాట్‌-గజ్జెల సుష్మ, చంపాపేట-సామరమణారెడ్డి, పీఅండ్‌టీకాలనీ-ధనలక్ష్మీ లోకేంద్రనాథ్‌, గడ్డిఅన్నారం-బి.సుభాషిణి.
భౌగోళిక స్థితి: నియోజకవర్గం జాతీయ రహదారులు 7, 9ల మధ్య ఉంది. దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు ఎన్‌హెచ్‌-9, డీఆర్‌డీఎల్‌ చౌరస్తా నుంచి నాగోలు వరకు ఎన్‌హెచ్‌-7
ఉంది.



మహేశ్వరం నియోజకవర్గం

ఎమ్మెల్యే : పి.సబితా ఇంద్రారెడ్డి (హోం మంత్రి)
ఓటర్ల సంఖ్య : 3,09,025
పురుష ఓటర్లు : 1,59,780
మహిళా ఓటర్లు : 1,49,245
మండలాలు:
మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు, సరూర్‌నగర్‌, మహేశ్వరం మండలాల పరిధితో ఏర్పాటైంది.
సహజవనరులు: మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం, సరూర్‌నగర్‌, కందుకూరు మండలాల్లో బిల్డింగ్‌ స్టోన్‌, కంకరరాయి, ఇటుకమట్టి, క్వార్ట్జ్‌, ఫీల్డ్‌ స్పార్‌ తదితర ఖనిజాలు లభిస్తున్నాయి.
రైల్వేస్టేషన్లు లేవు.

రాజేంద్రనగర్‌
నియోజకవర్గం: రాజేంద్రనగర్‌
ఆవిర్భావం : 2009
ఎమ్మెల్యే : టి.ప్రకాష్‌గౌడ్‌( తెలుగుదేశం)
జనాభా: 3లక్షలు
ఓటర్లు: 1,95,000 (మహిళలు: 99,000, పురుషులు: 96,000)
డివిజన్‌లు: 4 మున్సిపల్‌ డివిజన్‌లు రెండు మండలాలున్నాయి.
గ్రామాలు: 38. మేజర్‌ గ్రామపంచాయతీ:శంషాబాద్‌
నియోజకవర్గం విస్తీర్ణం:

మున్సిపాలిటీలు: రెండేళ్లక్రితం వరకు రాజేంద్రనగర్‌ మున్సిపాలిటీగా ఉండేది. ప్రస్థుతం సర్కిల్‌గా మారి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం అయింది.
ప్రాధాన్యాలు: పరిశోధనా సంస్థలు
శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఆసియా ఖండంలోనే ప్రత్యేక గుర్తింపుపొందిన రాజేంద్రనగర్‌ పరిశోధనా రంగంలో ప్రపంచఖ్యాతిని పొందింది. వ్యవసాయ ఉత్పత్తుల గురించి తెలుసుకునేందుకు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌ ఇక్కడికి వచ్చారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా రంగంలో ప్రపంచంలోని పలు దేశాల్లో ప్రసిద్ధి పొందింది. దీంతో పాటు నారం, ఎన్‌ఐఆర్‌డీ, శంషాబాద్‌లో కేంద్ర విత్తన పరిశోధనాకేంద్రం ఉంది. మరోవైపు ఔటర్‌రింగురోడ్డులతో రాజేంద్రనగర్‌ నియోజకవర్గం అన్నీ ప్రాంతాలకంటే ప్రత్యేకతను చాటుతోంది.
గ్రామాలు: మణికొండ, పుప్పాలగూడ, నెక్నాపూర్‌, ఖానాపూర్‌, కోకాపేట,


శేరిలింగంపల్లి

ఈ నియోజకవర్గం పరిధిలో చందానగర్‌, మియాపూర్‌, లింగంపల్లి ప్రాంతాలున్నాయి. నియోజకవర్గం పరిధిలో 4,21,113 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2,25,830 మంది పురుషులు కాగా 1,95,283 మంది స్త్రీలు.
చేవెళ్ల నియోజకవర్గం

ఎమ్మెల్యే : కె.ఎస్‌.రత్నం
ఓటర్ల సంఖ్య : 1,95,975
పురుష ఓటర్లు : 1,00,440
స్త్రీ ఓటర్లు : 95,535

చేవెళ్ల నియోజకవర్గంలో మొయినాబాద్‌ మండలంలోని చిల్కూరులో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం ఎంతో ప్రాధాన్యం కలిగిన పుణ్యక్షేత్రం.
మండలాలు: చేవెళ్ల నియోజకవర్గం చేవెళ్ల, మొయినాబాద్‌, శంకర్‌పల్లి, నవాబుపేట, షాబాద్‌ మండలాల పరిధితో ఏర్పాటయింది.
సహజవనరులు: చేవెళ్ల, షాబాద్‌, శంకర్‌పల్లి, మొయినాబాద్‌, నవాబుపేట మండలాల్లో ఇసుక, కంకరరాయి, ముల్తానీమట్టి, బిల్డింగ్‌ స్టోన్‌, ఆర్డినరీ క్లే, ఇటుక మట్టి, ఇసుక లభిస్తున్నాయి.
రైల్వే స్టేషన్లు: శంకర్‌పల్లి మండలంలోని శంకర్‌పల్లిలో, నవాబ్‌పేట మండలంలోని గుల్లగూడ, చిటిగిద్దలో రైల్వేస్టేషన్లు ఉన్నాయి.


పరిగి నియోజకవర్గం

ఎమ్మెల్యే : కె.హరీశ్వర్‌రెడ్డి (ప్రస్తుతం రాజీనామా చేశారు)
ఓటర్ల సంఖ్య : 2,05,455
పురుష ఓటర్లు : 1,01,676
స్త్రీ ఓటర్లు : 1,03,779
మండలాలు:
రిగి నియోజకవర్గం పరిగి, దోమ, కుల్కచర్ల, పూడూరు, గండేడ్‌ మండలాల పరిధితో ఏర్పాటయింది.
ఈ నియోజకవర్గంలోని పరిగి, కుల్కచర్ల, దోమ, గండేడ్‌, పూడూరు మండలాల్లో బిల్డింగ్‌ స్టోన్‌, కంకరరాయి, గ్రానైట్‌, బ్రిక్‌ ఎర్త్‌, ఇసుక, ముల్తానీమట్టి లభిస్తున్నాయి.
ఈ నియోజకవర్గంలో రైల్వేస్టేషన్లు లేవు.


వికారాబాద్‌ నియోజకవర్గం

ఎమ్మెల్యే : జి.ప్రసాద్‌ కుమార్‌
ఓటర్ల సంఖ్య : 1,85,945
పురుష ఓటర్లు : 93,327
స్త్రీ ఓటర్లు : 92,618
మండలాలు:
వికారాబాద్‌ నియోజకవర్గంలో వికారాబాద్‌ మున్సిపాలిటీ, వికారాబాద్‌, మర్పల్లి, మోమిన్‌పేట, ధారూర్‌, బంట్వారం మండలాలున్నాయి. ఈ నియోజకవర్గంలోని వికారాబాద్‌ మండలం అలంపల్లిలో పేరొందిన అలంపల్లి మఠం ఉంది.
సహజవనరులు: వికారాబాద్‌, ధారూర్‌, మర్పల్లి, మోమిన్‌పేట, బంట్వారం మండలాల్లో బిల్డింగ్‌ స్టోన్‌, కంకరరాయి, ఇసుక, ఆర్డినరీ క్లే, ముల్తానీ మట్టి, ఇటుక మట్టి(బ్రిక్‌ ఎర్త్‌), సున్నపురాయి లభిస్తున్నాయి.
రైల్వేస్టేషన్లు: మర్పల్లి మండలంలోని మర్పల్లి, మోమిన్‌పేట మండలంలోని సదాశివపేట రోడ్‌లో, ధారూర్‌ గాడంగూడలో, వికారాబాద్‌లో రైల్వేస్టేషన్లు ఉన్నాయి.

తాండూరు నియోజకవర్గం







 
ఎమ్మెల్యే : డాక్టర్‌ పి.మహేందర్‌రెడ్డి
ఓటర్ల సంఖ్య : 1,82,417
పురుష ఓటర్లు : 88,724
స్త్రీ ఓటర్లు : 93,693
మండలాలు:
ఈ నియోజకవర్గం పరిధిలో తాండూరు మున్సిపాలిటీ, తాండూరు, పెద్దేముల్‌, యాలాల, బషీరాబాద్‌ మండలాలు ఉన్నాయి. తాండూరు మండలం జుంటపల్లిలో శ్రీరామచంద్రస్వామి ఆలయానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది.
సహజవనరులు: తాండూరు, బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల్‌ మండలాల్లో సున్నపురాయి, ఆర్డినరీ క్లే, షాబాద్‌ స్టోన్‌, ముల్తానీ మట్టి(ఫుల్లర్స్‌ ఎర్త్‌), బిల్డింగ్‌ స్టోన్‌, కంకరరాయి, ఆర్డినరీ క్లే, ఇసుక తదితర సహజవనరులులభిస్తున్నాయి.
రైల్వే స్టేషన్లు: తాండూరులో పెద్దేముల్‌ మండలంలోని రుక్మాపూర్‌లో, బషీరాబాద్‌ మండలంలోని మైలారం, నవాన్‌డగ్‌లో రైల్వేస్టేషన్లు ఉన్నాయి.